Read more!

English | Telugu

పెళ్లిని కామెడీగా మార్చేసిన 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'!

 

రీసెంట్ గా యాంకర్ వర్ష చేతిలో తాళిబొట్టు పెట్టుకొని జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్‌ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని కొట్టిపారేశారు. మరికొందరు వర్ష పెళ్లి చేసుకోబోతుందంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే చాలామంది అనుకున్నట్లుగా ఇదొక చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని తేలిపోయింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. 

ఇందులో యాంకర్ వర్ష.. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ను పెళ్లాడుతూ కనిపించింది. వర్ష-ఇమ్మాన్యుయేల్ పెళ్లిపీటలపై ఒకరి పక్కన మరొకరు కూర్చొని తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఇంత‌కు ముందు సుధీర్-ర‌ష్మిలకు పెళ్లి చేసిన 'అహ నా పెళ్లంట‌', ఉగాది స్పెష‌ల్ ఈవెంట్‌ మంచి రేటింగ్స్ తెచ్చుకుంది.. అది మ‌ల్లెమాల వారిదే. అదే త‌ర‌హాలో ఇప్పుడు వర్ష-ఇమ్మాన్యుయేల్ లకు కూడా పెళ్లి చేసేసారు. 

ఇలా అందరికీ పెళ్లిళ్లు చేస్తూ మ‌ల్లెమాల సంస్థ‌ పెళ్లిళ్ల కళ్యాణ మండపంలా మారిందంటూ కామెంట్స్ చేస్తూ నెటిజన్లు. ఇంత దిగజారుడు ప్రమోషన్స్ అవసరమా..? అంటూ నిర్వాహ‌కులను తిట్టిపోస్తున్నారు. పెళ్లి అనే ప‌విత్ర బంధాన్ని కామెడీతో హేళన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొత్తగా ఆలోచించి ప్రోగ్రామ్స్ చేయమని సలహాలు ఇస్తున్నారు.