English | Telugu

మేకప్ లేకపోతే ఇలా ఉంటుంది అనసూయ ముఖం!!

యాంకర్ అనసూయకి బుల్లితెరపై ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎంతమంది తనను ట్రోలింగ్ చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటుంది. తాజాగా అనసూయ తన మొహంపై వచ్చిన మొటిమల గురించి చెబుతూ కొన్ని కామెంట్స్ చేసింది.

అనసూయ అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ మేకప్‌తోనే కనిపిస్తుంటుంది. మేకప్ లేకుండా చాలా అరుదుగా కెమెరా ముందుకు వస్తుంటుంది. తాజాగా ఆమె మేకప్ లేకుండా నెటిజన్ల ముందుకు వచ్చింది. తనకు మొహం నిండా పింపుల్స్ వచ్చాయని దానికి కారణాలు చెప్పుకొచ్చింది.

పింపుల్స్ రావడం అనేది ఓ సమస్య అని అందరూ ఫీల్ అవుతారని.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు.. అని చెప్పింది. ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కూడా ఫీలైపోతున్నారని చెప్పింది. కానీ అది సాధారణమైన విషయమని.. మన శరీర ఉష్ణోగ్రత సరిగ్గా పని చేస్తుందనే దానికి గుర్తు అని చెప్పుకొచ్చింది. తనకు ఈ పింపుల్స్ ఎందుకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశానని.. మామిడి పండ్లు తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పింది. అలా అని తినకుండా ఉండలేమని.. ఈ ఒక్క సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి.. మ్యాంగో లవర్స్ ఈ విషయంలో మొహమాటపడకండి.. నేను మీతో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.