English | Telugu

మేకప్ లేకపోతే ఇలా ఉంటుంది అనసూయ ముఖం!!

యాంకర్ అనసూయకి బుల్లితెరపై ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎంతమంది తనను ట్రోలింగ్ చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటుంది. తాజాగా అనసూయ తన మొహంపై వచ్చిన మొటిమల గురించి చెబుతూ కొన్ని కామెంట్స్ చేసింది.

అనసూయ అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ మేకప్‌తోనే కనిపిస్తుంటుంది. మేకప్ లేకుండా చాలా అరుదుగా కెమెరా ముందుకు వస్తుంటుంది. తాజాగా ఆమె మేకప్ లేకుండా నెటిజన్ల ముందుకు వచ్చింది. తనకు మొహం నిండా పింపుల్స్ వచ్చాయని దానికి కారణాలు చెప్పుకొచ్చింది.

పింపుల్స్ రావడం అనేది ఓ సమస్య అని అందరూ ఫీల్ అవుతారని.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు.. అని చెప్పింది. ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కూడా ఫీలైపోతున్నారని చెప్పింది. కానీ అది సాధారణమైన విషయమని.. మన శరీర ఉష్ణోగ్రత సరిగ్గా పని చేస్తుందనే దానికి గుర్తు అని చెప్పుకొచ్చింది. తనకు ఈ పింపుల్స్ ఎందుకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశానని.. మామిడి పండ్లు తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పింది. అలా అని తినకుండా ఉండలేమని.. ఈ ఒక్క సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి.. మ్యాంగో లవర్స్ ఈ విషయంలో మొహమాటపడకండి.. నేను మీతో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.