English | Telugu
నవ్య స్వామితో సుధీర్ పెళ్లి! వీడియో వైరల్!!
Updated : Jun 15, 2021
బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరని చెప్పాలి. ఆయన పెళ్లి మ్యాటర్ ఎప్పటినుండో వైరల్ అవుతోంది. 'జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్తో సుధీర్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారని మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఎప్పటికప్పుడు ఈ జంట క్లారిటీ ఇస్తూనే ఉంది. అయితే గతంలో ఓ షోలో భాగంగా సుధీర్, రష్మీలకు రీల్ పెళ్లి చేసేశారు. ఇప్పుడు మరోసారి సుధీర్ కి పెళ్లి చేయడం హాట్ టాపిక్ గా మారింది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సుధీర్ గా హోస్ట్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ షోలో కమెడియన్స్ సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకొని ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా 'జంబలకడిపంబ' కాన్సెప్ట్ తీసుకొని ఎంటర్టైన్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా.. జంబలకడిపంబ స్టైల్తో సాగే ఈ స్కిట్ లో సుధీర్ కి సీరియల్ నటి నవ్య స్వామితో పెళ్లి చేసేశారు.
ముందుగా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అబ్బాయి గెటప్ లో రోహిణి 'ఏమైనా పాటలొచ్చా' అని సుధీర్ని అడగగా.. 'కనపడిన ప్రతీ ఒక్కరిని అడిగా.. అడిగా అని అడుగుతూనే ఉండేవాడు' అంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ వేశాడు. ఆ తరువాత ఈ స్కిట్లో ఆటో రామ్ప్రసాద్, హైపర్ ఆది డైల్సాగ్స్తో నవ్వించారు. అనంతరం అబ్బాయిలాగా డ్రస్ చేసుకున్న నవ్య పెళ్లికూతురుగా ఎంటరైంది. "ఈవిడేనా పాపా?" అనడిగాడు సుధీర్. "ఫర్లేదు.. అబ్బాయి బాగానే ఉన్నాడు" అంది నవ్య. "పెళ్లికొడుకును ఏదైనా అడిగేదుంటే ముందే అడుగు" అని నవ్యతో చెప్పింది రోహిణి. "అడిగేదేముంది.. కోడినడిగి మసాలా నూరతామా" అని నవ్య అనడంతో ఆది బ్యాచ్ షాకైపోయింది.
ఆ తర్వాత సుధీర్ కి, నవ్యకు పెళ్లి చేసేశారు. నవ్య తలెత్తుకొని సుధీర్ మెడలో దండ వేస్తే, సుధీర్ తలదించుకొని దండను నవ్య చేతికి ఇవ్వగా, ఆమే దాన్ని తన మెడలో వేసుకుంది. ప్రస్తుతం ఈ స్కిట్ కు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.