English | Telugu

స్టేజ్ పైనే శేఖర్‌కి శ్రీముఖి ముద్దులు!.. మాస్ట‌ర్ భార్య ప‌రిస్థితేమిటో..!!

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో యాంకర్ శ్రీముఖి చాలా సన్నిహితంగా మెలుగుతుంటుంది. ఇద్దరూ కలిసి డాన్స్ వీడియోలు కూడా చేస్తుంటారు. అయితే తాజాగా ఓ టీవీ షోలో ఏకంగా స్టేజ్ మీదే శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టి షాకిచ్చింది శ్రీముఖి. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న సిక్స్త్ సెన్స్ నాల్గో సీజన్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి అనసూయ-హైపర్ ఆదిలు గెస్ట్ లుగా రాగా.. రెండో ఎపిసోడ్ కి శేఖర్ మాస్టర్-శ్రీముఖిలను తీసుకొచ్చారు ఓంకార్.

రెండు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఓంకార్ ఎలాంటి ఫిట్టింగ్ పెట్టారో తెలియదు కానీ.. శ్రీముఖి స్టేజ్ పైనే శేఖర్ మాస్టర్ కి గ్యాప్ ఇవ్వకుండా ముద్దులు పెట్టేసింది. వెంటనే శేఖర్ మాస్టర్ భార్య ఏమనుకుంటుందో అని.. 'మీ భార్య పేరేంటి..?' అని శేఖర్ మాస్టర్ ని అడిగి.. 'ఇది షోకి సంబంధించింది.. అన్నీ కల్పితాలే' అని చెప్పింది. నిజంగా ముద్దు పెట్టలేదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది.

కేవలం ముద్దులతో ఆగిపోలేదు. 'గిరా గిరా తిరిగే నడుము ఇది' అంటూ శ్రీముఖి నడుం దగ్గర శేఖర్ మాస్టర్ తలపెట్టి డాన్స్ స్టెప్పులు వేశారు. ఈ ముద్దులు, డాన్స్ లతో పాటు ఓంకార్ ను "బావా" అని పిలుస్తూ రెచ్చిపోయింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.