English | Telugu

అనసూయ డ్రెస్సింగ్‌పై కామెంట్స్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్!

యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పొట్టి పొట్టి బట్టలేసుకునే అనసూయను నెటిజన్లు టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ట్రోల్స్ పై అనసూయ ఘాటుగా స్పందిస్తుంటుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది తన ఇష్టమని కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా ఆమె డ్రెస్సింగ్ పై యాంకర్ శివ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా 'జబర్దస్త్' షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ప్రతీవారం ఎవరో ఒకరిని స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చే హైపర్ ఆది.. ఈసారి యాంకర్ శివను తీసుకొచ్చాడు. టిక్ టాక్, యూట్యూబ్ స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శివతో ఏదో స్కిట్ వేయించినట్లు ఉన్నాడు ఆది. అయితే స్కిట్ చివర్లో అనసూయను ఉద్దేశిస్తూ .. 'పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడంతో మీ పై కామెంట్స్ వస్తుంటాయి కదా.. దీని గురించి మిమ్మల్ని ఎప్పటినుండో అడగలనుకుంటున్నా' అని ప్రశ్నించాడు.

దాని అనసూయ ''వాళ్లెవరో అన్నారంటే.. ఇండస్ట్రీ గురించి తెలియదని అనుకోవచ్చు.. కానీ మీరు ఇక్కడి వారే కదా.. మీరు అడగడం ఏంటి..? అయినా ఇది నా వ్యక్తిగత విషయం'' అని బదులిచ్చింది. వెంటనే శివ 'పర్సనల్ అయితే మీ ఇంట్లో వేసుకోవచ్చుగా.. ఇక్కడ ఎందుకు' అని కౌంటర్ వేశాడు. దీంతో షాకైన అనసూయ స్టేజ్ మీద నుండి కిందకు వెళ్లిపోతూ ఆదిపై ఫైర్ అయింది. 'ఎవరెవరినో తీసుకొచ్చి.. మీకు తెలియకుండానే జరుగుతున్నాయా..?' అంటూ ఆదిపై కోప్పడింది. అయితే ఇదంతా నిజమా? లేక ప్రోమో కోసం ఇలా చేశారా..? అనేది తెలియాల్సివుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.