English | Telugu

కొన‌సాగ‌నున్న 'పాడుతా తీయగా'.. కొత్త జడ్జ్ ఎవరంటే..

ఎంతోమంది సింగర్స్ ను ఇండస్ట్రీకు పరిచయం చేసిన షో 'పాడుతా తీయగా'. దశాబ్దాలుగా ఈ షోకి ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా నడిపిస్తున్నారు ఈటీవీ నిర్వాహ‌కులు. ఈ షోకి ఓ వర్గం ప్రేక్షకులు వీరాభిమానులుగా మారిపోయారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ షోకి ప్రధాన కిరీటం అని చెప్పొచ్చు. ఆయన మరణం తరువాత ఇక ఈ షో ఉండదని అంతా అనుకున్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు కాబట్టి షోకి ఫుల్ స్టాప్ పెడతారనే వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు బాలు గుర్తుగా ఈ షోని నడిపించాలని నిర్ణయించుకున్నారు. సంగీతాభిమానుల‌కు ఇది తీపి క‌బురే. ఆయన స్థానంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ను తీసుకురావాలని రామోజీరావు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చరణ్ కూడా దీనికి అంగీకారం తెలిపారని సమాచారం. ఈయనతో పాటు ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్ సునీత కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

ఈ ముగ్గురి ఆధ్వ‌ర్యంలో 'పాడుతా తీయ‌గా' కొన‌సాగ‌బోతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఎస్పీ చరణ్ తండ్రి పేరుని నిలబెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తాలని కోరుకుందాం!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.