Read more!

English | Telugu

బ్రేకింగ్ న్యూస్ చదివేవాళ్ళతో ఐటెం సాంగ్స్ కి డాన్స్ చేయించిన ఓంకార్

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 చాలా గమ్మత్తైన గేమ్ షోగా బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రతీ వారం ఈ షోకి సెలబ్రిటీస్ వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక యాంకర్ ఓంకార్ వాళ్లకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ గేమ్ షోని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వీక్ గేమ్ షోకి ఒక న్యూస్ ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ చదివే దీప్తి వాజపేయి, ప్రత్యూష వచ్చారు. అలాగే బిగ్ బాస్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, గీతూ రాయల్, యాంకర్ శివ కూడా ఎంట్రీ ఇచ్చారు. "బ్రేకింగ్ న్యూస్ అంటూ సీరియస్ గా ఫేస్ పెట్టి వార్తలు చదివే మాటతో ఐటెం సాంగ్స్ కి డాన్స్ చేయించేస్తున్నారుగా" అంది ప్రత్యూష. ఇక షోలో చీర్ గర్ల్స్ ని చూసి "బాగున్నారా" అని దీప్తి అడిగేసరికి వాళ్లకు అర్ధం కాలేదు. "ఇలాంటి గెస్టులు లైవ్ లో దొరికారంటే ఇక అంతే" అంది దీప్తి. తర్వాత ఆదిరెడ్డి, గీతూ ఆ చీర్ గర్ల్స్ తో డాన్స్ చేశారు. ఇక దీప్తి తన లవ్ స్టోరీని షేర్ చేసుకుంది. ప్రత్యూష తన పిల్లల్ని కూడా ఈ షోకి తీసుకొచ్చింది.

బిగ్ బాస్ తర్వాత డిప్రెషన్ లోకి  ఎందుకు వెళ్ళావ్ అని ఓంకార్ గీతూని అడిగాడు. "గీతూ నేను నీ కోసమే బతుకుతున్నది. చచ్చిపోతాను అనే థాట్ నీ మైండ్ లోకి వచ్చిన ముందు క్షణమే నేను చచ్చిపోతాను అని మా నాన్న అన్నారు.  అప్పటినుంచి నేను మా పేరెంట్స్ కోసం ఉండాలి అనుకున్నా..వాళ్ళు నా కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు కదా. వాళ్ళ కోసం కూడా నేను ఏదో ఒకటి చేయాలి కదా..ఎవరో వచ్చి ఏదో చేశారని అస్సలు డిప్రెస్ అవ్వకూడదు" అని చెప్పింది గీతూ. ఇక యాంకర్ స్రవంతి చొక్కారపు మాత్రం కొంచెం ఎక్కువ చేసింది ఈ షోలో. చిన్నప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పిందట తానూ పెద్దయ్యాక ఓంకార్ ని పెళ్లి చేసుకుంటా అని. ఇక అలా చెప్తూనే తెగ సిగ్గు పడిపోయి "సిరిమల్లె పువ్వా" సాంగ్ కి ఓంకార్ ని చూపిస్తూ డాన్స్ చేసింది. ఇలా రాబోయే వారం షో అలరించబోతోంది.