English | Telugu

సెన్సేష‌న‌ల్ సింగ‌ర్‌.. ఊటీ డైరీస్‌!

సింగ‌ర్ మ‌ధుప్రియ చిన్న‌త‌నంలోనే "ఆడ‌పిల్ల‌నమ్మా నేను ఆడ‌పిల్ల‌న‌ని.." పాట‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. త‌ర్వాత కాలంలో ఓవైపు సింగ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకుంటూ, మ‌రోవైపు వార్త‌ల్లోనూ నిలుస్తూ వ‌చ్చింది. 2015లో మంగి శ్రీ‌కాంత్‌తో ఆమె పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్‌గా, సంచ‌ల‌నంగా మారింది. ఒక‌వైపు భ‌ర్త‌, మ‌రోవైపు త‌ల్లిదండ్రుల ప్రేమ మ‌ధ్య చిక్కుకొని ఇబ్బందులు ప‌డింది. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి.

'ఫిదా' మూవీలో "వ‌చ్చిండే పిల్లా మెల్ల‌గ వ‌చ్చిండే" సాంగ్‌తో సంగీత ప్రియుల‌ను త‌న హుషారైన గాత్రంతో అల‌రించింది. ఆ పాట‌తో బెస్ట్ ఫిమేల్ సింగ‌ర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ అందుకుంది. అలాగే 2020 సంక్రాంతికి వ‌చ్చిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో హీరోయిన్ ర‌ష్మిక కోసం ఆమె పాడిన "హి ఈజ్ సో క్యూట్" సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. సోష‌ల్ మీడియాలో మ‌ధుప్రియ బాగా యాక్టివ్‌. త‌ర‌చూ త‌న సోలో పిక్చ‌ర్స్‌తో పాటు ఫ్యామిలీ ఫొటోల‌ను కూడా షేర్ చేస్తుంటుందామె.

లేటెస్ట్‌గా ఆమె త‌న కుటుంబంతో ఊటీలో జాలీగా గడుపుతోంది. అమ్మానాన్న‌లు, అక్క‌చెల్లెళ్ల‌తో క‌లిసి ఆడిపాడుతూ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్చ‌ర్స్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది మ‌ధుప్రియ‌.

వాటిలో ఓ ఫొటోలో ఆమెను ఆమ్మానాన్న‌లు చెరో చెంప‌పై ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ పిక్చ‌ర్‌కు "మామ్ డాడ్" అనే క్యాప్ష‌న్ పెట్టింది. ఆమె షేర్ చేసిన వాటిలో అక్క‌, చెల్లెలితో క‌లిసున్న ఫొటోతో పాటు, ఊటీ తోట‌ల మ‌ధ్య పాట‌లు పాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి.

వాటికి #ootydiaries అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది మ‌ధుప్రియ‌. ఆ ఫొటోలు చూస్తుంటే ఆమె ఎంత ఆనందంగా ఊటీలో గ‌డుపుతోందో అర్థ‌మ‌వుతోంది.

అంత‌కు ముందు మార్చి 18న అమ్మానాన్న‌ల‌తో విడివిడిగా దిగిన ఫొటోల‌ను షేర్ చేసి, వాటికి "ఈ దునియాల నిష్కల్మషంగా ఓ ప్రేమ ఉంది అంటే అది తల్లిదండ్రులదే. love you both mummy daddy forever. Happy Wedding Anniversary" అనే క్యాప్ష‌న్ పెట్టింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.