English | Telugu

చనిపోదామనుకున్నా.. గాయ‌ని చిత్ర వ‌ల్లే బ‌య‌ట‌ప‌డ్డాను!

బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సింగ‌ర్‌ కల్పన.. బాలకృష్ణ నటించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో ఓ పాటలో కనిపించారు. అలానే విఠాలాచార్య దర్శకత్వంలో 'కామాక్షి కటాక్షం' అనే సినిమాలో నటించారు. అలానే తమిళ, మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. అయితే ఎక్కువ లైట్లు, అవుట్ డోర్ షూటింగ్ లంటే ఇష్టం లేకపోవడంతో నటిగా ప్రయాణం సాగించలేకపోయారు. అయితే ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందని ఆమె చెబుతుంటారు.

త‌ర్వాత కాలంలో ఆమె సంగీత పాఠాలు నేర్చుకొని సింగర్‌గా మారారు. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఆమె పాల్గొన్న విష‌యం తెలిసిందే. హౌస్‌లో ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఆ సమయంలో కల్పనపై మీమ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. ఎక్కువ రోజులు ఆమె షోలో కంటిన్యూ చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న కల్పన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

2010లో అన్నీ పోగొట్టుకున్నానని.. ఆ సమయంలో చనిపోదామనుకున్నట్లు చెప్పి దిగ్భ్రాంతికి గురిచేశారు. ఆ ఆలోచన నుండి గాయని చిత్ర తనను బయటకి తీసుకొచ్చారని.. చిన్నప్పటి నుండి ఆమెతో పరిచయం ఉందని చెప్పారు. మలయాళంలో ఓ షో జరుగుతోందని.. ఎలిమినేట్ అయినా పర్లేదు.. ప్రశాంతంగా ఉంటుంది వస్తావా అంటూ చిత్ర అడగడంతో.. ఎలాగైనా గెలవాలనే కసితో ఆ షోలో పాల్గొన్నట్లు చెప్పారు. అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు.. తన వల్ల ఇండస్ట్రీ పరువు పోతోందని చాలా మంది అన్నారని తెలిపారు. ప్రొఫెషనల్ సింగర్ ఇలా కంటెస్టెంట్ గా రావడం ఏంటని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. ఫైనల్‌గా ఆ షోలో తనే విజేతగా నిలిచినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.