English | Telugu

చనిపోదామనుకున్నా.. గాయ‌ని చిత్ర వ‌ల్లే బ‌య‌ట‌ప‌డ్డాను!

బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సింగ‌ర్‌ కల్పన.. బాలకృష్ణ నటించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో ఓ పాటలో కనిపించారు. అలానే విఠాలాచార్య దర్శకత్వంలో 'కామాక్షి కటాక్షం' అనే సినిమాలో నటించారు. అలానే తమిళ, మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. అయితే ఎక్కువ లైట్లు, అవుట్ డోర్ షూటింగ్ లంటే ఇష్టం లేకపోవడంతో నటిగా ప్రయాణం సాగించలేకపోయారు. అయితే ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందని ఆమె చెబుతుంటారు.

త‌ర్వాత కాలంలో ఆమె సంగీత పాఠాలు నేర్చుకొని సింగర్‌గా మారారు. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఆమె పాల్గొన్న విష‌యం తెలిసిందే. హౌస్‌లో ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఆ సమయంలో కల్పనపై మీమ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. ఎక్కువ రోజులు ఆమె షోలో కంటిన్యూ చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న కల్పన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

2010లో అన్నీ పోగొట్టుకున్నానని.. ఆ సమయంలో చనిపోదామనుకున్నట్లు చెప్పి దిగ్భ్రాంతికి గురిచేశారు. ఆ ఆలోచన నుండి గాయని చిత్ర తనను బయటకి తీసుకొచ్చారని.. చిన్నప్పటి నుండి ఆమెతో పరిచయం ఉందని చెప్పారు. మలయాళంలో ఓ షో జరుగుతోందని.. ఎలిమినేట్ అయినా పర్లేదు.. ప్రశాంతంగా ఉంటుంది వస్తావా అంటూ చిత్ర అడగడంతో.. ఎలాగైనా గెలవాలనే కసితో ఆ షోలో పాల్గొన్నట్లు చెప్పారు. అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు.. తన వల్ల ఇండస్ట్రీ పరువు పోతోందని చాలా మంది అన్నారని తెలిపారు. ప్రొఫెషనల్ సింగర్ ఇలా కంటెస్టెంట్ గా రావడం ఏంటని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. ఫైనల్‌గా ఆ షోలో తనే విజేతగా నిలిచినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.