English | Telugu

రజనీకాంత్‌కు రూల్స్ వ‌ర్తించ‌వా? సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

నటి కస్తూరి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. 'గృహలక్ష్మి' సీరియల్‌తో కస్తూరి ఇప్పుడు తెలుగువారిని అలరిస్తున్నారు. అలా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటున్న ఆమె.. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది మే నెల నుండి ఇండియన్స్ ఎవరూ కూడా అమెరికా వెళ్లడానికి వీలు లేకుండా అమెరికా ప్రభుత్వం బ్యాన్ విధించిందని.. మెడికల్ చెక‌ప్స్‌ కోసం కూడా ఛాన్స్ ఇవ్వలేదని.. ఇలాంటి సమయంలో రజనీకాంత్ అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించారు కస్తూరి. అమెరికాలో పని చేసేవారు.. ఎన్నారైలు మాత్రమే ఇండియా నుండి వెళ్లే ఛాన్స్ ఉందని.. అలాంటి వారిని మాత్రమే అమెరికా రానిస్తోంద‌ని.. కానీ రజనీకాంత్ ఈ సమయంలో అమెరికా వెళ్లడం మిస్టరీగా మారిందని చెప్పుకొచ్చారు.

చాలా మంది ఆయన వైద్యం కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని అమెరికా వెళ్లారని అంటున్నారు. అసలు ఆయన ఆరోగ్య సమస్య ఏంటని ప్రశ్నించారు కస్తూరి. ఇండియాలో ఆయన్ను ట్రీట్ చేసే హాస్పిటల్స్ లేవా? అంటూ మండిపడ్డారు. రజనీకాంత్ లాంటి పెద్దలు రూల్స్ పాటించకపోతే.. అంతకుమించి దారుణమైనది మరొకటి ఉండదని చెప్పింది. ఏ ఒక్కరూ రూల్స్ కంటే పెద్దవారు కాదని.. అందరినీ ప్రశ్నించవచ్చని.. అది రజనీకాంత్ అయినా సరే, ఇంకొకరు అయినా సరే అంటూ వరుస ట్వీట్లు పెట్టారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.