English | Telugu

రజనీకాంత్‌కు రూల్స్ వ‌ర్తించ‌వా? సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

నటి కస్తూరి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. 'గృహలక్ష్మి' సీరియల్‌తో కస్తూరి ఇప్పుడు తెలుగువారిని అలరిస్తున్నారు. అలా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటున్న ఆమె.. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది మే నెల నుండి ఇండియన్స్ ఎవరూ కూడా అమెరికా వెళ్లడానికి వీలు లేకుండా అమెరికా ప్రభుత్వం బ్యాన్ విధించిందని.. మెడికల్ చెక‌ప్స్‌ కోసం కూడా ఛాన్స్ ఇవ్వలేదని.. ఇలాంటి సమయంలో రజనీకాంత్ అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించారు కస్తూరి. అమెరికాలో పని చేసేవారు.. ఎన్నారైలు మాత్రమే ఇండియా నుండి వెళ్లే ఛాన్స్ ఉందని.. అలాంటి వారిని మాత్రమే అమెరికా రానిస్తోంద‌ని.. కానీ రజనీకాంత్ ఈ సమయంలో అమెరికా వెళ్లడం మిస్టరీగా మారిందని చెప్పుకొచ్చారు.

చాలా మంది ఆయన వైద్యం కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని అమెరికా వెళ్లారని అంటున్నారు. అసలు ఆయన ఆరోగ్య సమస్య ఏంటని ప్రశ్నించారు కస్తూరి. ఇండియాలో ఆయన్ను ట్రీట్ చేసే హాస్పిటల్స్ లేవా? అంటూ మండిపడ్డారు. రజనీకాంత్ లాంటి పెద్దలు రూల్స్ పాటించకపోతే.. అంతకుమించి దారుణమైనది మరొకటి ఉండదని చెప్పింది. ఏ ఒక్కరూ రూల్స్ కంటే పెద్దవారు కాదని.. అందరినీ ప్రశ్నించవచ్చని.. అది రజనీకాంత్ అయినా సరే, ఇంకొకరు అయినా సరే అంటూ వరుస ట్వీట్లు పెట్టారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.