English | Telugu

ఇటు భార్య‌తో రొమాన్స్‌.. అటు న‌వ్యతో కెమిస్ట్రీ!

బుల్లితెరపై వచ్చే షోలలో ఈ మధ్యకాలంలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువైంది. లవ్ ట్రాక్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పటికే చాలా ఎక్కువయ్యాయి. అయితే యాంకర్ సుమ నిర్వహించే షోలావు ఇలాంటివి పెద్దగా కనిపించవు. కానీ తాజాగా విడుదలైన 'క్యాష్' ప్రోమోలో మాత్రం రొమాన్స్ ఓ రేంజ్ లో పండించారు. ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రియల్ జంట, రీల్ జంట అంటూ వచ్చే వారం ప్రసారం కాబోయే ఓ ఎపిసోడ్ లో సుమ గెస్ట్ లను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

రియల్ జంటలో భాగంగా 'దేవత' సీరియల్ ఫేమ్ అర్జున్, అతని భార్య సురేఖలను గెస్ట్ లుగా తీసుకురాగా.. రీల్ జంటలో భాగంగా రవికృష్ణ, నవ్యలను తీసుకొచ్చారు. షోలో భాగంగా సురేఖను.. మీ ఆయన రాత్రి తొమ్మిది గంటలకు వస్తానని చెప్పి పన్నెండు అయినా రాకపోతే ఏం చేస్తావని సుమ అడిగారు. దానికి సురేఖ వెంటనే.. వీడియో కాల్ చేస్తా అని అనడం, దానికి రవి "నెట్ ఆఫ్ చేస్కో" అని సలహా ఇవ్వడం అందరినీ నవ్వించింది. ఆ తరువాత నవ్యని.. "లవ్ మ్యారేజ్ చేసుకుంటావా..? ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా..?" అని సుమ ప్రశ్నించింది. దాని నవ్య.. "అరేంజ్డ్" అని.. లవ్ చేసినా.. పెద్దలను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పింది.



వెంటనే సుమ "మరి ఎవరినైనా లవ్ చేస్తున్నావా..?" అని అడిగింది. దానికి నవ్య.. రవికృష్ణ వైపు చూసి లేదని చెప్పింది. దీంతో సుమ "అటు వైపు ఎందుకు చూశావ్?" అంటూ నవ్యని ఏడిపించేసింది. మ‌ధ్య‌లో ర‌వికృష్ణ "యాక్ష‌న్" అని చెప్ప‌గా, అర్జున్‌, న‌వ్య‌స్వామి రొమాంటిక్ సీన్‌కు ప‌ర్ఫామ్ చేయ‌డం, దాన్ని చూసి సురేఖ ఉడుక్కోవ‌డం అల‌రించింది.

చివర్లో అర్జున్ తన భార్యకు ప్రపోజ్ చేస్తూ.. గులాబీపువ్వుని ఇచ్చాడు. ఆ పువ్వుని మునిపంటితో బంధించేసింది సురేఖ. అప్పుడు అర్జున్ తన నోటితో ఆ పువ్వుని లాగేసుకోవడంతో అందరూ నోరెళ్లబెట్టేశారు. దీనికి సంబందించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.