English | Telugu

సుధీర్‌కు కన్నుకొడుతూ.. పెదాలు కొరుక్కుంటూ రెచ్చిపోయిన రష్మీ!

బుల్లితెర జోడీ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'జబర్దస్త్', 'ఢీ' వంటి షోలలో ఈ జంట చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ఈవెంట్ మేనేజర్స్ కూడా ఈ పెయిర్ తో మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'ఢీ 10' ప్రోమోలో వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ హైలైట్ అయింది. అందరూ చూస్తుండగానే సుధీర్‌కు కన్నుకొడుతూ రష్మీ రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా యాంకర్ ప్రదీప్ డల్ గా ఉన్న సుధీర్‌ను స్టేజ్ పైకి పిలిచాడు. అతడితో పాటు హైపర్ ఆది కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒకేరకమైన బట్టలు వేసుకొని కనిపించారు. సుధీర్ పర్పుల్ కలర్ వేసుకోవడంతో.. ప్రదీప్ పరుపుల అంటూ సెటైర్ వేశాడు. వెంటనే జడ్జి ప్రియమణి పరుపుల సుధీర్ అంటూ పరువు తీసేసింది. అనంతరం ప్రోమో చివర్లో రష్మీ-సుధీర్ ల రొమాన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అందరూ చూస్తుండగానే డైరెక్ట్ గా సుధీర్‌కి కన్నుకొడుతూ పక్కకు పిలిచింది రష్మీ. అంతేకాదు.. అతని వంక చూస్తూ మునిపంటితో పెదాలు కొరుక్కుంది. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రియమణి అయితే నోరెళ్లబెట్టింది. ఇక రష్మీ అలా పిలవడంతో సుధీర్ ప‌ర‌వ‌శంతో మైమ‌ర‌చిపోయాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.