English | Telugu

అనసూయను చాలా దూరం వెనక్కి నెట్టేసిన రష్మీ!

బుల్లితెరపై యాంకర్ అనసూయకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా ఆమెకి లక్షల ఫాలోవర్లు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆమె హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో టాప్ 10లో ఉన్నారు. కానీ 2020 ఏడాదికి గాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో అనసూయకి టాప్ 10లో కూడా చోటు దక్కలేదు. నిజానికి లాక్‌డౌన్ లో అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఆమె ఈసారి 13వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అనసూయకి 13వ స్థానం దక్కితే రష్మీ గౌతమ్ మాత్రం ఏకంగా టాప్ 4లో నిలవడం గమనార్హం. అనసూయతో పోలిస్తే రష్మీకు సోషల్ మీడియాలో పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా అనసూయ టాప్ 10 నిలుస్తుందేమో చూడాలి. ఇటీవల అనసూయ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా 'ఆహా'లో విడుదలైంది. కానీ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ప్రస్తుతం అనసూయ.. 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కథ ప్రకారం ఆమె సునీల్ భార్య పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ గా 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికి తగ్గట్లుగానే అనసూయ రోల్ ని కూడా పొడిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాతో అనసూయకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.