English | Telugu

బ్రూనోను కిరాత‌కంగా చంప‌డంపై యాంకర్ రష్మి ఎమోషనల్ పోస్ట్!

యాంకర్ రష్మీ గౌత‌మ్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు పలు విషయాలపై ఆమె స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మూగజీవాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటుంది. మూగజీవాల పరిరక్షణ కోసం ఆమె ఎన్నో మంచి పనులు చేసింది కూడా. ఈ క్రమంలో త‌ను ట్రోలింగ్‌కు గుర‌వుతున్నా ఏమాత్రం ప‌ట్టించుకోదు. పండగల్లో జంతు బలి ఇవ్వడాన్ని తప్పుబడుతూ రష్మీ చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు.

అయితే రష్మీ మాత్రం అసలు రాజీ పడదు. హిందూ సంప్రదాయాన్నే కాదు.. మూగజీవాలకు హాని కలిగించే ప్రతి అంశాన్నీ ఆమె వేలెత్తి చూపుతుంటుంది. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అనే తేడా లేకుండా అన్నింటి గురించి ఆలోచిస్తుంటుంది. వీధి కుక్కలపై జరిగే దాడిని ఎప్పటికప్పుడు ఖండిస్తుంటుంది.ఇటీవ‌ల‌ ఓ బీచ్‌లో బ్రూనో అనే కుక్కను ముగ్గురు కలిసి కిరాతకంగా చంపేశారు. కర్రలతో బాది ఆ తరువాత చేపల గాలానికి వేలాడదీసి చంపేశారు.

ఈ భయంకరమైన ఘటన అందరినీ కుదిపేసింది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన రష్మీ.. మనుషులు, మానవత్వం అనే దానిపై సిగ్గేస్తోంద‌ని.. కరోనా లాంటివి రావడం సమంజసమే అనిపిస్తోందని కామెంట్స్ చేసింది. బ్రూనో హంతకుల‌నుఉద్దేశిస్తూ.. "అది మీకేం అన్యాయం చేసింది.. అదేం పాపం చేసిందని దాన్ని అలా చంపారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది ర‌ష్మి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.