English | Telugu

చీర‌లో ర‌ష్మి తీన్మార్ స్టెప్పులు.. అద‌రిపోయిన స్టేజీ!

లేటెస్ట్ గా విడుదలైన 'ఢీ' షోకి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్ ల టెరిఫిక్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఒకటి కాగా.. చీర కట్టుకొని యాంకర్ రష్మీ వేసిన తీన్మార్ స్టెప్పులు ఇంకొక కారణమని చెప్పాలి. ఈ షోలో సుధీర్ తో కలిసి రష్మీ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ, దీపికా పిల్లి కాలేజ్ సీనియర్స్ గా.. సుధీర్, ఆది వాళ్ల జూనియర్స్ గా కనిపించి ఫన్ క్రియేట్ చేశారు.

ముందుగా మీ పేర్లేంటి అని రష్మీ ప్రశ్నించగా.. ఆది తనను ఆదమ్మగా, సుధీర్ ని సూదమ్మగా పరిచయం చేశాడు. ఆ సమయంలో షోలో ఉన్నవాళ్ళంతా తెగ నవ్వుకున్నారు రష్మీ.. సుధీర్ ని ర్యాగింగ్ చేసే క్రమంలో కొన్ని పంచ్ లు బాగా పేలాయి. ''నువ్ ఫ్రెషరా..?'' అని రష్మీ.. సుధీర్ ని ప్రశ్నించగా.. ''హా ఫ్రెష్'' అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. ఆ తరువాత 'మీ ఊర్లో ఏం చేస్తుంటారని' రష్మీ అడిగితే.. 'విత్తనాలు వేస్తుంటామ్' అని చెప్పాడు సుధీర్. 'నువ్ విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారు' అని రష్మి అడగ్గా.. "మా అక్కే సూదమ్మ" అని పంచ్ వేశాడు హైపర్ ఆది.

ఇక ప్రోమో చివర్లో తీన్మార్ దరువుకి రష్మీ వేసిన స్టెప్పులు మాములుగా లేవు. చీరకట్టి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న రష్మీ.. చెంగు మడిచి మాస్ స్టెప్పులు వేసి స్టేజ్ ని షేక్ చేసేసింది. ఆమె డాన్స్ కి అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. చివరకు చీర చెంగుని తీసుకొని ఏమీ తెలియదన్నట్లుగా సైలెంట్ గా వెళ్లి కూర్చొని.. తన ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.