English | Telugu

జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించిన 'కార్తీకదీపం'!

రోజురోజుకి 'కార్తీకదీపం' సీరియల్ ను మరింత ఉత్కంఠ కలిగించేలా రూపొందిస్తున్నారు. దీంతో ఈ సీరియల్ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. తెలుగులో అయితే ఈ సీరియల్ కు పోటీగా మరే సీరియల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతుంది. ఇప్పటికే బుల్లితెర చరిత్రలో అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఇప్పుడు మరో రికార్డును దక్కించుకుంది. ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ సాధించిన సీరియల్ గా రికార్డులు సృష్టించింది.

అయితే ఈ నెంబర్ వన్ స్థానం 'కార్తీకదీపం' సీరియల్ కు ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈ సీరియల్.. ఈ వారం 21.01 టీఆర్పీ సాధించి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంది. అంతకుముందు 20.07 ఉన్న టాప్ టీఆర్పీ రేటింగ్ ను బ్రేక్ చేసింది. అయితే ఈ విషయాన్ని నిరుపమ్ పరిటాల ఫ్యాన్స్ పేజ్‌లో అభిమానులు షేర్ చేయగా.. దీన్ని ప్రేమి విశ్వనాథ్ తన ఫేస్ బుక్ స్టోరీగా పెట్టుకుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇక ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. ఇన్నాళ్లు అనుమానంతో దీపను దూరం పెట్టిన డాక్టర్ బాబు ఇప్పుడిప్పుడే ఆమె నిజాయితీను తెలుసుకొని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో కథలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. మోనిత తను గర్భవతినని దానికి కారణం కార్తీక్ అంటూ అందరి ముందు చెప్పింది. దీంతో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఒక్క పాయింట్ తో మరో మూడేళ్లు సీరియల్ నడిపించినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు!

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.