Read more!

English | Telugu

జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించిన 'కార్తీకదీపం'!

 

రోజురోజుకి 'కార్తీకదీపం' సీరియల్ ను మరింత ఉత్కంఠ కలిగించేలా రూపొందిస్తున్నారు. దీంతో ఈ సీరియల్  టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. తెలుగులో అయితే ఈ సీరియల్ కు పోటీగా మరే సీరియల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతుంది. ఇప్పటికే బుల్లితెర చరిత్రలో అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఇప్పుడు మరో రికార్డును దక్కించుకుంది. ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ సాధించిన సీరియల్ గా రికార్డులు సృష్టించింది. 

అయితే ఈ నెంబర్ వన్ స్థానం 'కార్తీకదీపం' సీరియల్ కు ఇదే తొలిసారి కాదు.  ఇప్పటికే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈ సీరియల్.. ఈ వారం 21.01 టీఆర్పీ సాధించి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంది. అంతకుముందు 20.07 ఉన్న టాప్ టీఆర్పీ రేటింగ్ ను బ్రేక్ చేసింది. అయితే ఈ విషయాన్ని నిరుపమ్ పరిటాల ఫ్యాన్స్ పేజ్‌లో అభిమానులు షేర్ చేయగా.. దీన్ని ప్రేమి విశ్వనాథ్ తన ఫేస్ బుక్ స్టోరీగా పెట్టుకుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ఇక ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. ఇన్నాళ్లు అనుమానంతో దీపను దూరం పెట్టిన డాక్టర్ బాబు ఇప్పుడిప్పుడే ఆమె నిజాయితీను తెలుసుకొని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో కథలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. మోనిత తను గర్భవతినని దానికి కారణం కార్తీక్ అంటూ అందరి ముందు చెప్పింది. దీంతో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఒక్క పాయింట్ తో మరో మూడేళ్లు సీరియల్ నడిపించినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు!