Read more!

English | Telugu

'కార్తీకదీపం' దర్శకుడితో వంటలక్క.. ఆడిపోసుకుంటున్న‌ నెటిజన్లు!

 

బుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్ గా అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతోంది 'కార్తీకదీపం'. వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తున్నారు. బోర్ కొట్టిన ప్రతిసారీ ఓ కొత్త ట్విస్ట్ ను తెరపైకి తీసుకొచ్చి.. ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సీరియల్ ను అభిమానించే వారితో పాటు తిట్టుకుంటూ చూసేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. 

సీరియ‌స్‌లో దీపను ముప్పుతిప్పలు పెడుతున్న 'కార్తీకదీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్రతో కలిసి లేటెస్ట్‌గా ఓ ఫోటో తీసుకుంది వంటలక్క. ఈ ఫోటోను తన సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో షేర్ చేయగా.. నెటిజన్లు ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. ''సీరియల్ ను ఏం తీస్తున్నారు సార్.. సూపర్'' అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇంకెన్నాళ్లు సాగదీస్తారు? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 

అయితే లేటెస్ట్‌ ఎపిసోడ్ లో మోనిత ప్రెగ్నంట్ అనే ట్విస్ట్ ను రివీల్ చేశారు. ఈ పాయింట్ గనుక ఎక్కువ రోజులు సీరియల్ ని సాగదీస్తే రేటింగ్స్ పడిపోవడం ఖాయమని శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ దర్శకుడు గతంలో 'అందం', 'బంగారు బొమ్మ' లాంటి సీరియల్స్ ని డైరెక్ట్ చేశాడు. అలానే తెలుగులో కొన్ని సినిమాలను సైతం డైరెక్ట్ చేశాడు. మోహ‌న్‌బాబు, సౌంద‌ర్య జంట‌గా వ‌చ్చిన 'శివ‌శంక‌ర్' మూవీ డైరెక్ట‌ర్ ఆయ‌నే. ఆ సినిమా కానీ, దాని త‌ర్వాత వ‌చ్చిన 'రాంబాబు గాడి పెళ్లాం' కానీ వ‌ర్క‌వుట్ కాకపోవడంతో టీవీ సీరియల్స్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. కార్తీక దీపం బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డంతో ఆయ‌న ద‌శ తిరిగింది.