English | Telugu

కీర్తి సీమంతంలో డాక్టర్ బాబు దంప‌తులు.. ఫోటోలు వైరల్!

బుల్లితెరపై అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్‌ 'కార్తీకదీపం'. నటుడు నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబు పాత్రలో, ప్రేమి విశ్వనాథ్.. దీప పాత్రలో జీవించేస్తున్నారు. రీసెంట్ గా డాక్టర్ బాబు రియల్ లైఫ్ మరదలికి సీమంతం జరిగింది. ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడు, రచయిత ఓంకార్ పరిటాల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆయన భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె సోదరి కీర్తి, సోదరి భర్త ధనుష్ కూడా సీరియల్ నటులే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కీర్తి ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'హిట్లర్ గారి పెళ్లాం' అనే సీరియల్ లో నటిస్తోంది. కీర్తి భర్త‌ ధనుష్ కూడా సీరియల్స్ లో హీరోగా నటిస్తున్నాడు. అత‌ను కొన్ని సినిమాల్లోనూ న‌టించాడు. రీసెంట్ గా కీర్తి సీమంతం ఆమె నివాసంలోనే ఘనంగా జరిగింది.

కరోనా కారణంగా అతి తక్కువమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేడుక జరిగింది. ఈ వేడుకలో నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కీర్తి కన్నడ సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో సైతం ఆమె పలు సీరియల్స్ లో నటించింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.