English | Telugu

ముక్కు అవినాష్ పెళ్లి ఫిక్స్ కానీ..!

'జబర్దస్త్' షోతో బుల్లితెరకు పరిచయమైన కమెడియన్ ముక్కు అవినాష్. తన కామెడీ టైమింగ్ తో క్రేజ్ తెచ్చుకున్న అవినాష్ కి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. హౌస్ లో అవినాష్ ఎంట్రీ ఇచ్చిన తరువాత తన కామెడీతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. తన పాపులారిటీ బాగా పెంచుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అవినాష్ పెళ్లికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ నాలుగో సీజన్ సమయంలోనే అవినాష్ పెళ్లి విషయం హాట్ టాపిక్ అయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా అవినాష్ తన పెళ్లి గురించే మాట్లాడుతుండేవాడు. అదే సమయంలో అరియనా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించేవాడు. అంతేకాదు.. హౌస్ లోకి వచ్చిన వాళ్ల అమ్మతో తన పెళ్లి చేయమని కోరాడు. దీంతో అప్పట్లో అవినాష్ పెళ్లి వార్తలు హైలైట్ అయ్యేవి. ఇటీవల ఈ టాప్ కమెడియన్ కి పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బుల్లితెర వర్గాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

నిజానికి ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని అవినాష్ భావించాడట. కానీ ఇప్పడు వచ్చే ఏడాదికి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ తెలంగాణ అమ్మాయిని అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం అవినాష్ 'కామెడీ స్టార్స్' అనే షోతో పాటు పలు షోలలో సందడి చేస్తున్నాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.