English | Telugu

సీరియల్ నుండి తీసేయడంతో భోరుమ‌న్న‌ నటి!

'నా పేరు మీనాక్షి' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి.. మధు రెడ్డి. 2015 నుండి 2021 వరకు ఆమె ఈ సీరియల్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో డెలివెరీ కోసం బ్రేక్ తీసుకున్నప్పటికీ.. తిరిగి అదే సీరియల్ లో రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్నాళ్లుగా ఆమె సీరియల్ లో కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆమెని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆమె వివరణ ఇస్తూ బోరున ఏడ్చేసింది.

చాలా సీరియల్స్ లో నటించినప్పటికీ 'నా పేరు మీనాక్షి' సీరియల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అయితే కొన్నాళ్లుగా ఈ సీరియల్ డేట్స్ కోసం ఒకటి రెండు రోజులు మాత్రమే తనను అడుగుతున్నారని తెలిపింది. దానికోసం పదిహేను నుండి ముప్పై రోజులు బ్లాక్ చేస్తుండడంతో వేరే సీరియల్స్ చేయలేకపోతున్నానని దర్శకనిర్మాతలకు చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. నెలలో రెండు రోజుల కోసం నెలంతా గడపాలంటే కష్టమని చెప్పింది.

అయినప్పటికీ 'నా పేరు మీనాక్షి'తో మంచి పేరు రావడంతో సీరియల్ ను వదల్లేకపోయానని తెలిపింది. అయితే తను దర్శకనిర్మాతలను అడగడంలో తప్పు ఉందో ఏమో తెలియదు కానీ తనను మొత్తానికి సీరియల్ నుండి తప్పించినట్లు వివరించింది మధు రెడ్డి. పిలుస్తారులే అని చాలా రోజులు చూశానని.. కానీ అలా జరగలేదని ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.