Read more!

English | Telugu

మైత్రి మూవీ మేకర్స్ కొత్త సీరియల్...కార్తీకదీపం సీరియల్ తో పోటి!


స్టార్ మా టీవీలో దాదాపు ఆరు సంవత్సరాల పాటు టెలికాస్ట్  అయిన ఏకైక సీరియల్ 'కార్తీకదీపం'. అయితే దానికి కొనసాగింపుగా కార్తీకదీపం-2  నవ వసంతంగా రానుంది. ఇందులో డాక్టర్ బాబు భార్య ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. వంటలక్క భర్త లేడని శౌర్య పాప ప్రోమోలో చెప్పి‌ంది‌. మరి ఇప్పుడు ఉన్న డాక్టర్ బాబుకి పెళ్ళి అయిందా.. వంటలక్క భర్త ఎవరు అనే ఆసక్తితో ఈ సీరియల్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారువారి పాట, ఖుషీ ఇలా అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు సీరియల్స్‌ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. జీ తెలుగులో సోమవారం మార్చి 25 న ' మా అన్నయ్య ' సీరియల్ ప్రారంభం కానుంది. ఈ సీరియల్ ని నిర్మిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్ . దీంతో ఈ సీరియల్ పై ఆసక్తి పెరిగింది. అయితే అదే రోజున బుల్లితెర ధారావాహికల్లో పెను సంచలనం సృష్టించిన కార్తీకదీపం-2 రాబోతుంది. ఈ రెండు సీరియల్స్ ఒకేరోజున ప్రారంభం అవుతుండటంతో ఏది హిట్ అవుతుందోనని సీరియల్ అభిమానులతో పాటు నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.

 జీ తెలుగులో మార్చి 25 నుంచి ‘మా అన్నయ్య’ అనే సీరియల్ ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుండగా.. ప్రోమో అయితే అదిరిపోయింది. ముగ్గురు చెల్లెల్ల బాధ్యతను భుజాన మోస్తున్న కథతో అన్నయ్య పాత్ర ఆకట్టుకుంది. ఈ సీరియల్‌లో సీనియర్ హీరోయిన్ రాశి.. హీరోకి తల్లిగా కనిపించబోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు సీరియల్స్ మధ్య గట్టి పోటీ ఉంది. మరి ఈ రెండు సీరియల్స్ లో ఏది మీరు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.