English | Telugu

చచ్చిపోతానేమో అని భయపడ్డా!

'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ కి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అవినాష్ తన కామెడీతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఒకానొక సమయంలో ట్రోఫీ తనే పట్టుకుపోతాడేమో అనుకున్నారు. కానీ హౌస్ లో కొన్ని గొడవల్లో అవినాష్ ఇన్వాల్వ్ అవ్వడం, ఎలిమినేషన్ వరకు వెళ్లడం వంటి విషయాలు అతడ్ని వెనక్కి లాగేశాయి. కానీ అవినాష్-అరియనా ట్రాక్ మాత్రం జనాలను ఆకట్టుకునేది.

ఇదిలా ఉండగా.. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అవినాష్ స్టార్ మా ఛానెల్ లోనే పలు షోలతో బిజీ అయ్యాడు. 'కామెడీ స్టార్స్' షోలో తన స్కిట్ లతో కామెడీ పండిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ షోలో పాల్గొన్న అవినాష్ కరోనా భయంతో తను చనిపోతానేమో అని భయపడిన విషయాన్ని వెల్లడించాడు. షోలో భాగంగా ఓ టీమ్ 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాలో 'ఆశా పాశం' అనే పాటకు పెర్ఫార్మ్ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు కరోనా సోకి చనిపోవడం, కనీసం కుటుంబ సభ్యులకు కూడా చివరి చూపు దక్కకపోవడం వంటి విషయాలను తమ పెర్ఫార్మన్స్ ద్వారా అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇది చూసిన అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. రీసెంట్ గా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. మొదటి మూడు రోజుల్లో అయితే చనిపోతానేమో అని భయపడిపోయానని చెప్పుకొచ్చాడు. నటి అషురెడ్డి కూడా ఈ పెర్ఫార్మన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తన తాతయ్య కూడా కరోనాతో చనిపోయారని.. చివరిచూపుకి కూడా నోచుకోలేకపోయామంటూ ఏడ్చేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.