English | Telugu

ఆ సినిమా వల్ల చాలా బాధపడ్డా! కొన్ని రోజులు బ‌య‌ట‌కు రాలేదు!!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జబర్దస్త్' షోతో ఫేమస్ అయిన ఈ భామ ఈరోజు 36వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. తన కెరీర్ లో ఓ సినిమా కారణంగా ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు బయటకు కూడా రాలేకపోయానని చెబుతోంది. 2013లో ఎన్టీఆర్ నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అనసూయ.

దాదాపు పదమూడేళ్ల తరువాత ఆమె నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'లో ఆయ‌న మ‌ర‌ద‌లి పాత్ర‌లో మెరిసింది. ఆ వెంటనే 'క్షణం' సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ పోషించింది. ఇక ఆ తరువాత ఐటెం సాంగ్స్ అని, గెస్ట్ రోల్స్ అని బిజీగా గడిపింది. 'రంగస్థలం' సినిమాలో చేసిన రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఖిలాడి', 'రంగమార్తాండ' అనే సినిమాలున్నాయి. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ 'కథనం' సినిమా కార‌ణంగా ఎంతో బాధ పడ్డానని చెప్పింది.

'క్షణం' సినిమా తరువాత 'కథనం' సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని.. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడిందని.. కానీ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిందని చెప్పింది. దాంతో ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయానని వెల్లడించింది. తనకు ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్‌ తాగి.. ఆ బాధనంతటిని భర్త ముందు వెళ్లగక్కుకుని ప్రశాంతంగా నిద్రపోతానని చెప్పుకొచ్చింది అన‌సూయ‌.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.