English | Telugu

'ఫినాలే'లో ఊహించ‌ని గిఫ్ట్‌! దుఃఖాన్ని ఆపుకోలేక‌పోయిన మోనాల్‌!

గతేడాది బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత ఆ షోకి బదులుగా ఓంకార్ 'డాన్స్ ప్లస్' షోను మొదలుపెట్టాడు. ఆరుగురు జడ్జిలతో సరికొత్తగా ఈ షోను డిజైన్ చేశారు. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ను తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. కొరియోగ్రాఫర్లను తీసుకోవాల్సిన స్థానంలో ఆమెని ఎలా తీసుకుంటారనే విమర్శలు వినిపించాయి. కేవలం గ్లామర్ షో కోసం ఆమెని తీసుకొని ఉంటారనే కామెంట్స్ చేశారు.

ఏదైతేనేం మోనాల్ గ్లామర్, ఆమె ఎమోషన్ షోకి బాగానే కలిసొచ్చింది. ఫైనల్ గా ఈ షో ముగిసిపోయింది. అందరూ భావించినట్లుగానే సంకేత్ సహదేవ్ విజేతగా నిలిచాడు. శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. అయితే ఈ షోను మోనాల్ ఇంట్లో చిల్ అవుతూ చూసింది. ఫినాలే ఆదివారం నాడు మొదలైనప్పటికీ షూటింగ్ ముందే పూర్తయి ఉంటుంది. అలా మోనాల్ తన ఇంట్లో కూర్చొని బీర్ తాగుతూ షోని వీక్షించింది.

మోనాల్ వ్యక్తిగత జీవితం గురించి అందరినీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో చాలా సార్లు తన ఫ్యామిలీ విషయాలు చెప్పింది. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడం గురించి మోనాల్ ఇదివరకు చాలా సార్లు చెప్పింది. ఈ ఫినాలే ఎపిసోడ్ లో మోనాల్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు ఓంకార్. తండ్రి త‌న భుజంపై చేయివేసి నిల్చున్న‌ట్లుగా వేసిన పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో మోనాల్ ఎమోషనల్ అయింది.వ‌స్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.