English | Telugu

యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసిన మోనాల్!

చాలా కాలం క్రితం హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మోనాల్. 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆమెకి సరైన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. గతేడాది బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షోతో అమ్మడుకి క్రేజ్ బాగా పెరిగింది. తన గ్లామర్ తో చాలా మందిని ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు లవ్ ట్రాక్ లతో వార్తల్లో నిలిచింది.

హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ బులితెరపై 'డాన్స్ ప్లస్' షోలో జడ్జిగా కనిపించింది. ఈ షో పూర్తి కావడంతో స్టార్ మా ఛానెల్ మోనాల్ కి మరో ఆఫర్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ ఛానెల్ లో ఓ కామెడీ షోని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ షోకి మోనాల్ ను యాంకర్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై ఆమె సంతకం కూడా పెట్టేసిందట. ఎంతో గ్రాండ్ గా ఈ షోని డిజైన్ చేస్తున్నారని.. ఇందులో చాలా మంది పేరున్న కమెడియన్లు భాగం కానున్నారని స‌మాచారం. అందుకే మోనాల్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. యాంకర్ గా మోనాల్ గనుక క్లిక్ అయితే ఆమెకి బుల్లితెరపై మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.