English | Telugu

నిద్రలోనే చనిపోతాననుకున్నా.. నా చెల్లెలు వ‌చ్చి సేవ‌లు చేసింది!!

'జబర్దస్త్' కామెడీ షోతో గత ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్నాడు అదిరే అభి. తన కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేసిన అభి.. ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలు చేశాడు. అతడికి మంచి పేరు రావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్లుగా ఆయన బుల్లితెరకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో 'జబర్దస్త్' షోలో తన కామెడీ స్కిట్ లతో ఆకట్టుకుంటున్నాడు. మిగిలిన వారి స్కిట్ లలో బూతులు దొర్లినా.. అదిరే అభి మాత్రం క్లీన్ కామెడీతో మెప్పిస్తుంటాడు.

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కమెడియన్లు కూడా నిజ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఆ విషయాలను బయటపెడుతుంటారు. అభి కూడా తన జీవితంలో ఓ మర్చిపోలేని అనుభవం గురించి ఓ షోలో చెప్పుకొచ్చాడు. సుమ యాంకర్ గా ప్రముఖ ఛానెల్ లో 'క్యాష్' షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోకి సెలబ్రిటీ అన్నా, చెల్లెళ్లను అతిథులుగా తీసుకొచ్చారు.

మహేష్ విట్టా, రోల్ రైడా, అదిరే అభి తమ చెల్లెళ్లతో రాగా.. బిగ్ బాస్ హిమజ తన తమ్ముడిని తీసుకొచ్చింది. వీరందరూ కలిసి షోని చాలా ఎంటర్టైనింగ్ గా మలిచారు. ఇదే సమయంలో అభి తను నిద్రలోనే చనిపోతాననుకున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. తనకు కరోనా సోకిందని.. అప్పుడు చనిపోతాననే భయంతో రాత్రిపూట తన రూమ్ గొళ్లెం పెట్టకుండా పడుకునేవాడ్నని చెప్పుకొచ్చారు. నిద్రలో ఏదైనా జరిగితే తనను చూడ్డం కుదరదని అలా చేసేవాడినని కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో తన చెల్లెలు దుబాయ్ నుండి వచ్చి తనకు సేవలు చేసిందని చెప్పుకొచ్చారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.