English | Telugu

నిద్రలోనే చనిపోతాననుకున్నా.. నా చెల్లెలు వ‌చ్చి సేవ‌లు చేసింది!!

'జబర్దస్త్' కామెడీ షోతో గత ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్నాడు అదిరే అభి. తన కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేసిన అభి.. ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలు చేశాడు. అతడికి మంచి పేరు రావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్లుగా ఆయన బుల్లితెరకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో 'జబర్దస్త్' షోలో తన కామెడీ స్కిట్ లతో ఆకట్టుకుంటున్నాడు. మిగిలిన వారి స్కిట్ లలో బూతులు దొర్లినా.. అదిరే అభి మాత్రం క్లీన్ కామెడీతో మెప్పిస్తుంటాడు.

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కమెడియన్లు కూడా నిజ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఆ విషయాలను బయటపెడుతుంటారు. అభి కూడా తన జీవితంలో ఓ మర్చిపోలేని అనుభవం గురించి ఓ షోలో చెప్పుకొచ్చాడు. సుమ యాంకర్ గా ప్రముఖ ఛానెల్ లో 'క్యాష్' షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోకి సెలబ్రిటీ అన్నా, చెల్లెళ్లను అతిథులుగా తీసుకొచ్చారు.

మహేష్ విట్టా, రోల్ రైడా, అదిరే అభి తమ చెల్లెళ్లతో రాగా.. బిగ్ బాస్ హిమజ తన తమ్ముడిని తీసుకొచ్చింది. వీరందరూ కలిసి షోని చాలా ఎంటర్టైనింగ్ గా మలిచారు. ఇదే సమయంలో అభి తను నిద్రలోనే చనిపోతాననుకున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. తనకు కరోనా సోకిందని.. అప్పుడు చనిపోతాననే భయంతో రాత్రిపూట తన రూమ్ గొళ్లెం పెట్టకుండా పడుకునేవాడ్నని చెప్పుకొచ్చారు. నిద్రలో ఏదైనా జరిగితే తనను చూడ్డం కుదరదని అలా చేసేవాడినని కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో తన చెల్లెలు దుబాయ్ నుండి వచ్చి తనకు సేవలు చేసిందని చెప్పుకొచ్చారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.