English | Telugu

''దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం"!

బుల్లితెరపై యాంకర్ ఝాన్సీ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో తెలిసిందే. అలానే సినిమాల్లో కూడా ఏ పాత్ర చేసినా త‌న‌దైన ముద్ర వేస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అందరిలానే ఝాన్సీ కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు. షూటింగులన్నీ ఆగిపోవడంతో చాలా మంది సినీ కార్మికులు రోడ్డున పడుతున్నారు. దీంతో కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి వారికి సాయం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనాను విపరీతంగా ద్వేషిస్తున్నానంటూ ఝాన్సీ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తన బంధువుల పెళ్లికి హాజరు కాలేకపోయానని.. పెళ్లిని కూడా ఆన్లైన్ లో చూసుకోవాల్సి వచ్చిందనీ తెలిపారు. తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు. మామూలుగా అయితే సెలబ్రిటీలు షూటింగ్ ల కోసం, అలానే ట్రిప్ ల కోసం వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్లడం కుదరడం లేదు. దీన్నే సెటైరికల్ గా చెప్పారు ఝాన్సీ.

''మళ్ళీ త్వరలో ఇలా ట్రావెల్ చేసే రోజులు వస్తే బాగుండు.. అంతా మన చేతుల్లోనే ఉందంట ... తొందరగా వాక్సిన్ వేయించేసుకోండి. అప్పటి వరకు మాస్కేసుకుని... దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం. ( వాటిని ఎవరూ ఆపలేరుగా )'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో తన ట్రావెల్ ఫోటోని షేర్ చేసి రాసుకొచ్చారు. ఝాన్సీ చివరిగా 'మన్మథుడు 2' సినిమాలో కనిపించారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.