English | Telugu

అన‌సూయ‌కు సారీ చెప్పిన శివ‌.. ఫూల్స్ అయిన ఫ్యాన్స్‌!!

రీసెంట్ గా 'జబర్దస్త్'కు సంబంధించిన ప్రోమో ఒకటి యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది. స్టేజ్ మీద యాంకర్ శివ అడిగిన ప్రశ్న‌కు ఆ షో వ్యాఖ్యాత, నటి అనసూయ కోప్పడి వెళ్లిపోయింది. హైపర్ అది స్కిట్ లో భాగంగా గెస్ట్ గా వచ్చిన యాంకర్ శివ.. మిమ్మల్ని ఎప్పటినుండో ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా అని.. ఆమె డ్రెస్సింగ్ గురించి అడిగాడు.

దానికి అనసూయ 'అది నా పర్సనల్ విషయం' అని చెప్పింది. వెంటనే శివ.. 'పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవచ్చుగా.. ఇక్కడ ఎందుకు' అని అనగానే.. అనసూయ కోపంతో వెళ్లిపోయింది. ఇది చూసిన అభిమానులు నిజంగానే అనసూయ హర్ట్ అయి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఎప్పటిలానే ఈ ప్రోమోని కూడా పబ్లిసిటీ కోసం అలానే కట్ చేశారు.

స్టేజ్ మీద నుండి కోపంగా వెళ్లిపోయిన అనసూయను హైపర్ ఆది, యాంకర్ శివ కన్విన్స్ చేసి స్టేజ్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నించారు. యాంకర్ శివ పదే పదే అనసూయకు సారీ చెప్పారు. ఈ బాగోతాన్ని జడ్జిలు రోజా, మను చూస్తూ ఉన్నారు. ఆ తరువాత స్టేజ్ మీదకు వచ్చిన అనసూయ 'రోజా గారు మీరు నమ్మేశారు కదా' అంటూ ఫూల్ చేసే ప్రయత్నం చేసింది. దానికి రోజా అస్సలు నమ్మలేదంటూ అనసూయ గాలి తీసేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.