English | Telugu

Jayam serial: పూజ పూర్తి చేసిన గంగ, రుద్ర.. పారుకి ఝలక్! 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'Jayam'(జయం). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -165 లో.... గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. ఇద్దరు కలిసి పూజలో కూర్చుంటారు. గంగ పూజకి వచ్చింది అంటే నా మాట మీద గౌరవం ఉన్నట్లే అని గంగ గురించి శకుంతల పాజిటివ్ గా అనుకుంటుంది.

మరొకవైపు గంగ అకాడమీలో లేదని పారుకి తెలిసి.. వెళ్లిపోతున్న మేడమ్ ని ఆపి "మేడం గంగ అకాడమీలో లేదు ఇంట్లో ఏదో పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్లిందట" అని పారు అంటుంది. నీ మాటను నమ్మలేనని మేడమ్ అంటుంది. అక్కడ ఉన్న మేనేజర్.. గంగ వాళ్ల ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా మేడమ్ అని అంటాడు. దాంతో మేడం, మేనేజర్ కలిసి వెళ్తుంటే నేను వస్తానని పారు అంటుంది. ఇక వాళ్ళు ఒకే అనడంతో పారు కూడా వెళ్తుంది.

మరొకవైపు పూజ పూర్తి అవుతుంది. ఇక గంగని అకాడమీలో డ్రాప్ చేస్తానని రుద్ర అంటాడు. పూజ చేసిన వాళ్లు నిద్ర చెయ్యాలి కదా అని ఇషిక అంటుంది. అవును రేపు ప్రొద్దున దింపేసిరా అని శకుంతల అంటుంది. అ తర్వాత పారు, మేడం వాళ్ళు ఇంటికి వస్తారు. గంగ అకాడమీలో లేకుండా ఇంటికి వచ్చిందని తెలిసి మేడమ్ చెకింగ్ కి వచ్చారని పారు అంటుంది. చెక్ చేసుకోండి అని శకుంతల వాళ్లకి చెప్పగానే పెద్దసారు వాళ్ళు టెన్షన్ పడతారు.

మేనేజర్ చెక్ చేసి గంగ ఇక్కడ లేదని చెప్పగానే పారు షాక్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే చెకింగ్ కి రాగానే శకుంతల గంగ, రుద్ర దగ్గరికి వెళ్తుంది. గంగని వెనకాల నుండి డ్రైవర్ తో పంపిస్తుంది. మేడమ్ వాళ్ళు శకుంతల ఫ్యామిలీకి సారీ చెప్పి వెళ్ళిపోతారు. శకుంతల మంచి పని చేసిందని పెద్దసారు అంటాడు. పూజ అయ్యాక పంపిస్తానన్నాను పంపించానని శకుంతల అంటుంది. మేడమ్ వాళ్ళు అకాడమీకి వెళ్తారు. అక్కడ గంగ పూజ చేస్తూ కన్పిస్తుంది. దాంతో పారు షాక్ అవుతుంది. గంగ తన మాటలతో పారుకి చుక్కలు చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.