English | Telugu

సీఎంపై కస్తూరి ఫైర్‌.. కామెంట్స్ వైర‌ల్‌!

ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారి, సీరియల్స్ తో బిజీ అయ్యారు. స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'గృహాలక్ష్మి సీరియల్ లో కస్తూరి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో ప్రతి విషయంపైనా ఆమె స్పందిస్తూ ఉంటారు. స్వతహాగా న్యాయవాది కావ‌డంతో కస్తూరి అన్ని విషయాలపైనా అవగాహనతో మాట్లాడుతుంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషణలో ముందుంటారు. సినీ, రాజకీయ విషయాలపై కస్తూరి శంకర్ చేసే కామెంట్స్ వివాదాస్పదమవుతుంటాయి.

గతేడాది లాక్ డౌన్ నుండి కస్తూరి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ తమిళనాడులో వివాదానికి దారి తీశాయి. అయితే చివరికి ఆ మూడో పెళ్లి కూడా పెటాకులు అవ్వడంపై కస్తూరి కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈమె కరోనా వైరస్, దేశ ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆక్సిజన్ కొరత వంటి విషయాలపై వేస్తోన్న కౌంటర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె కేరళ సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకారంపై కామెంట్ చేశారు.

రెండోసారి వ‌రుస‌గా ముఖ్యమంత్రి అయిన‌ పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం వేడుక‌కు మొత్తం 500 మంది హాజరయ్యారు. దీని గురించి ప్రశ్నిస్తూ.. అదే ఓ కామన్ మ్యాన్ విషయంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. సంతాపం తెలిపేందుకు 20 మందికి మించి మాత్రం అనుమతివ్వరా..? అంటూ ప్రశ్నించారు. 'అన్ని జంతువులు సమానమే.. కానీ కొన్ని జంతువులు ఎక్కువ సమానం' అంటూ కౌంటర్ వేశారు. "ప్రమాణ స్వీకారం బడ్జెట్ తో ఎంత మందికి కరోనా వ్యాక్సిన్ వేయొచ్చో తెలుసా..?" అంటూ కస్తూరి మండిప‌డ్డారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.