English | Telugu

'కార్తీక దీపం'లో షాకుల మీద షాకులు!

బుల్లితెర ధారావాహిక 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ సోమ‌వారం 969వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు మోనిత ఏం చేయ‌బోతోంది.. దాని వ‌ల్ల దీప ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోబోతోంది.. కార్తీక్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు?.. అన్న‌దే ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. విహారికి పిల్ల‌లు పుట్ట‌ర‌ని డాక్ట‌ర్ ద్వారా తెలుసుకున్న తుల‌సి ఆ విష‌యాన్ని దీప‌కు చెబుతుంది.

ఇలాగైనా నీ కాపురం నిల‌బ‌డితే చాలని చెబుతుంది. "ఇప్పుడు కూడా ఈ అవ‌కాశాన్ని వాడుకోక‌పోతే ఆ దేవుడు నీకు ఇచ్చిన ఈ అవ‌కాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురాన్ని నిల‌బెడితే నాకు కావాల్సింది ఏముంది" అంటుంది తుల‌సి.. క‌ట్ చేస్తే .. కార్తీక్‌ని సౌంద‌ర్య "రేపే క‌దా కోర్టు?"` అన‌డుగుంది. "లేదు.. నేను కేసు విత్‌డ్రా చేసుకున్నాను" అంటాడు కార్తీక్‌.. "అదేంట్రా!" అంటూ షాక‌వుతుంది సౌంద‌ర్య‌. "నేను కోర్టుకు వెళ్ల‌నంటే ఆనందించాల్సింది పోయి అప్సెట్ అవుతావేంటి మ‌మ్మీ" అంటాడు.

ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే మ‌ధ్య‌లో మోనిత ఎంట‌ర‌వుతుంది. తులసితో దీప మాట్లాడిన వీడియోను కార్తీక్‌కి, సౌంద‌ర్య‌కి చూపించి షాకిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? దీప‌ని కార్తీక్ ఏమైనా అన్నాడా?.. తీర్థ‌యాత్ర‌లు తిరిగి వ‌చ్చిన‌ 'అర్ధ‌పావు' భాగ్యం త‌న ఇంటికి వ‌చ్చిన కార్తీక్‌ని ఏమ‌డిగింది? .. దాంతో కార్తీక్ ఎందుకు షాక‌య్యాడు? .. సౌంద‌ర్య చెప్పిన విష‌యం విని దీప ఎందుకు షాక‌య్యింది?.. ఇంత‌కీ దీప‌కు సౌంద‌ర్య చెప్పిన షాకింగ్ విష‌యం ఏంటీ? అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.