English | Telugu

'కార్తీకదీపం' కబుర్లు: మోనిత తన గొయ్యి తానే తవ్వుకుందా?

'కార్తీక దీపం'లో కథ కొత్త మలుపు తీసుకుంది. డాక్టర్ బాబు కార్తీక్, వంటలక్క దీపను విడదీయాలని మోనిత వేసిన పథకం ఆమె మెడకు చుట్టుకోబోతుందా? న్యాయం వైపు నిలబడే అధికారి ఏసీపీ రోషిణి దగ్గరకు వెళ్లి మోనిత తప్పు చేసిందా? తన గొయ్యి తానే తవ్వుకుందా? మంగళవారం ఎపిసోడ్ చూస్తే చాలామందికి అవునని అనిపిస్తోంది. అసలు, మంగళవారం ఏమైంది? అనే విషయంలోకి వెళితే...

కార్తీక్ తప్పు చేశాడని, తనను తల్లిని చేశాడని మోనిత చెప్పిన మాటలను వంటలక్క విశ్వసించదు. పైగా, గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపుతుంది. దాంతో ఆవేశంగా 'మీ అందరి అంతు చూస్తా' అంటూ అక్కడ నుంచి మోనిత నిష్క్రమిస్తుంది. ఏదో ఒకటి చేయాలని ఏసీపీ రోషిణి ఇంటికి వెళుతుంది. గతంలో దీప మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసింది ఆవిడే. కార్తీక్ స్నేహితురాలే మోనిత అని రోషిణి గుర్తు పడుతుంది. సమస్య ఏంటో చెప్పమని అడుగుతుంది.

తనకు అన్యాయం జరిగిందని, పెళ్లి కాకుండా తల్లిని అయ్యానని, అందుకు కారణం కార్తీక్ అని మోనిత ఏకరువు పెడుతుంది. సమాజం ఇటువంటి పని చేస్తే హర్షిస్తుందని అనుకుంటున్నారా? అని రోషిణి ప్రశ్నిస్తుంది. మోనిత చెప్పింది విన్నాక... 'స్నేహితుడిని ఇంటికి పిలిచి, మద్యం తాగడానికి అనుమతి ఇచ్చి, అతడి గదిలోకి మీరు వెళ్లి, ఏంటిది? స్నేహమే ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇప్పుడు మీ సమస్య ఏంటి?' అని రోషిణి అడుగుతుంది. ఇప్పుడు కార్తీక్ మొహం చాటేస్తున్నాడని, అతడి కుటుంబం తనను అవాయిడ్ చేస్తుందని, తన బిడ్డ అనాథలా పెరగడం తనకు ఇష్టం లేదని మోనిత కన్నీళ్లు పెట్టుకోవడంతో రోషిణి మనసు కరుగుతుంది. కార్తీక్, దీప ఇంటికి వెళుతుంది.

కార్తీక్ మీద మోనిత మీద కంప్లయింట్ ఇచ్చిందని రోషిణి చెప్పగా... దీపలో ఎటువంటి భయం కనిపించదు. ధైర్యంగా న్యాయం చేయమని కోరుతుంది. పదేళ్లలో జరగని తప్పు, తాను భర్తతో కలిసిన తర్వాతే ఎందుకు జరిగిందో తనకు అర్థం కావడం లేదని రోషిణికి అర్థమయ్యేలా దీప వివరిస్తుంది. దాంతో మోనిత తప్పు చేసిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో చాలామందిలో కలిగింది. అక్కడితో ఎపిసోడ్ కి ఎండ్ కార్డు వేశారు. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తి కలిగించారు. అయితే, మోనిత ఇచ్చిన కంప్లయింట్ ఆమె మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.