English | Telugu

'కళ్యాణ వైభోగం' కహానీ: దివ్య మరణం తథ్యమా?

దివ్య మరణం తథ్యమా? శాపం ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుందా? చెల్లి ప్రాణం కాపాడటం కోసం అభి ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు? 'కళ్యాణ వైభోగం' సీరియల్ లో మంగళవారంనాటి ఎపిసోడ్ ముగింపు ప్రేక్షకులను మునివేళ్లపై ఉంచిందని చెప్పాలి. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియళ్లలో జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమయ్యే 'కళ్యాణ వైభోగం' ఒకటి.

అన్నాచెలెళ్లు అభి, దివ్య సహా వాళ్ళ కుటుంబ పతనమే పరమావధిగా, తన ప్రాణరక్షణే ధ్యేయంగా నిత్యా శ్రీనివాస్ వేసిన పథకం ఫలించింది. దివ్య కుటుంబానికి ఉన్న శాపం ప్రకారం... ఆ ఇంటికి వచ్చే కోడలు మరణిస్తుంది. కానీ, ఈసారి శాపం దివ్యకు కూడా ఉందని పురోహితులు చెబుతారు. అది తెలిసిన చారి పక్షవాతం బారినపడి మంచానికి పరిమితం అవుతాడు. మరోవైపు శాపం గురించి నిత్యా శ్రీనివాస్ చెవిన పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే... దివ్య ప్రాణాలతో ఉండాలంటే ఆమెకు పెళ్లి కాకూడదు. పెళ్ళైతే మరణిస్తుంది. ఒకవేళ దివ్యకు పెళ్లి కాకపోతే నిత్యా శ్రీనివాస్ మరణిస్తుంది. ఇది తెలుసుకున్న నిత్యా, అక్క కూతురు మెడలో మూడు ముడులు పడేలా పావులు కదుపుతుంది. చాణక్యకు కోపం వచ్చేలా చేసి, అతడిని దివ్య ఇంటికి పంపిస్తుంది.

ఆవేశంతో దివ్య, అభిల ఇంటికి వెళ్లిన చాణక్య... దివ్య మెడలో తాళి కడతాడు. శాపం గురించి దివ్య, ఇతర కుటుంబ సభ్యులకు తెలియనప్పటికీ... అభికి తెలుసు. తన ముందే చెల్లెలు మెడలో మూడు ముడులు పడటంతో షాక్ తింటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మరి, తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. సీరియల్ లో మేజర్ ట్విస్ట్ ఇది. ఇప్పుడు దివ్య మరణం తథ్యమా? చెల్లి ప్రాణాలు అభి కాపాడలేడా? అని అందరూ చర్చల్లోకి దిగారు. రాబోయే రోజుల్లో సీరియల్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.