English | Telugu

'కార్తీకదీపం' చిన్నారులు శౌర్య‌, హిమ నెల సంపాద‌న ఇంతా?!

బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని సీరియల్స్ పోటీ పడుతున్నా.. 'కార్తీకదీపం'ను బీట్ చేయలేకపోతున్నారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగా సీరియల్స్ అంటే ఎక్కువగా గృహిణులు మాత్రమే చూస్తుంటారనే అపోహ ఉండేది కానీ ఈ సీరియల్ ను పురుషులు స‌హా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేస్తున్నారు.

ఇక ఈ సీరియల్ లో నటించే వారందరికీ పాపులారిటీ పెరిగింది. డాక్టర్ గా బాబుగా చేస్తున్న నిరుపమ్ కి, వంటలక్కగా నటిస్తోన్న ప్రేమి విశ్వనాథ్ లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక వీరి పిల్లలుగా నటిస్తోన్న హిమ (సహృద), శౌర్య (కృతిక)లకు కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. అయితే ఈ సీరియల్ కు సంబంధించి ఈ పిల్లలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. సాధారణంగా లీడ్ యాక్టర్స్ కు ఎపిసోడ్ లెక్కన రెమ్యునరేషన్ ఇస్తుంటారు.

సైడ్ క్యారెక్టర్ లకు, అలానే చిన్న పిల్లలకు రోజు వారీ లెక్కన పారితోషికం చెల్లిస్తారట. ఈ క్రమంలో బేబీ కృతిక‌, బేబీ సహృదలకు రోజువారీ కాల్షీట్ చొప్పున‌ చెల్లిస్తారట. ఆ లెక్కన చూసుకుంటే ఈ పిల్లలకు రోజుకి రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నారట. అంటే నెలలో ప‌ది రోజులు షూటింగ్ జ‌రిగినా వీళ్ల సంపాదన లక్షల్లో ఉంటుందన్నమాట!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.