English | Telugu

బిగ్ బాస్ 5లోకి 'జబర్దస్త్' భామ!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. గతేడాది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటూ షోని పూర్తి చేయగలిగారు. అయితే ఈ ఏడాది పరిస్థితులు దారుణంగా మారడంతో నిర్వాహకులు కాస్త జంకుతున్నారు. మరోపక్క కరోనా రూల్స్ ను అతిక్రమించారని.. మలయాళ బిగ్ బాస్ సెట్ ను పోలీసులు సీజ్ చేసి, షో షూటింగ్‌ను ఆపేశారు.

దీంతో తెలుగు షో మరింత ఆలస్యం చేయాలని చూస్తున్నారట. ఇదంతా పక్కన పెడితే షోలో ఎవరిని కంటెస్టెంట్ లుగా తీసుకోవాలనే చర్చ ఇంకా జరుగుతోందని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే వీలైనంత త్వరగా షోని మొదలుపెట్టాలి కాబట్టి కంటెస్టెంట్ల లిస్ట్ రెడీ చేసుకొని వారితో డీల్ కుదుర్చుకొని సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'జబర్దస్త్' బ్యూటీ వర్షను సంప్రదించారని సమాచారం.

సోషల్ మీడియాలో వర్షకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈమెని టీవీ కోటా కింద బిగ్ బాస్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఆమెని తీసుకురావడం ద్వారా షోకి గ్లామర్ యాడ్ చేయాల‌నుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఆర్టిఫిషియల్‌ ఎఫైర్ పెట్టుకోవడానికి కూడా ఆమె ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్ తో అలాంటి ట్రాక్ ఒకటి నడిపిస్తోంది కాబట్టి వర్షని తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.