English | Telugu

ఈ సారి మిస్ అవ్వొద్దు.‌. దీప మర్డర్ కి ప్లాన్ ఫిక్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -149 లో... కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. వద్దని మాకు చెప్పావ్ దీపకి చెప్పలేదా అని జ్యోత్స్న అనగానే.. చెప్పినా నేను వినను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో సాయం చేయడానికి వచ్చానని దీప అంటుంది. అంటే వంటమనిషిగానా లేక పనిమనిషిగానా అని పారిజాతం అడుగుతుంది. మనసున్న మనిషి గా వచ్చిందని కార్తీక్ అంటాడు. వాడిని రెస్ట్ తీసుకోనివ్వండని కాంచన అంటుంది.

ఆ తర్వాత జ్యోత్స్న వాళ్ళు అందరు హాల్లోకి వస్తారు. ఇంట్లో పనులు చెయ్యడానికి.. నువ్వు ఎందుకు ఇంటికి కాబోయే కోడలు ఉంది కదా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్నకి వంట వచ్చా అని కాంచన అంటుంది. నేను చేస్తాను కదా అని పారిజాతం అనగానే.. అయితే బట్టలున్నాయి ఉతుకుతానని అనగానే పారిజాతం షాక్ అవుతుంది. చేయించుకునే వాళ్ళు ఈ పనులు చేయమంటే చెయ్యరు.. జ్యోత్స్న గారాబంగా పెరిగిందని కాంచన అంటుంది. జ్యోత్స్న నువ్వు వెళ్లి బావకి జ్యూస్ ఇవ్వమని చెప్పగానే జ్యోత్స్న వెళ్తుంది. తను వెళ్లేసరికి కార్తీక్ శౌర్యతో ఫోన్ మాట్లాడతాడు. దీపని పిలువు జ్యోత్స్న అని కార్తీక్ అంగగానే జ్యోత్స్నకి కోపం వస్తుంది. వెళ్లి దీపకి చెప్పి కోపంగా పారిజాతాన్ని తీసుకొని వెళ్తుంది. మరొకవైపు కాశీ తన ప్రేమ విషయం దాస్ కి చెప్తాడు. స్వప్న బయటే ఉందని కాశీ అనగానే కోడలిని బయట ఉంచావ్.. నేను మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాను.. అది కూడా అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోవాలి. అప్పుడే పెళ్లి అని దాస్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్నతో పారిజాతం మాట్లాడుతుంది. అన్ని పనులు నేర్చుకో.. నువ్వు కార్తీక్ కి దగ్గర గా ఉండు దాన్ని చూసి మనం రావడమేంటి? నువ్వు ఎవరివో గుర్తు పెట్టుకో.. అసలు నిజం తెలిసేవరకు నువ్వు కార్తీక్ భార్యవి అయితే నీ స్థానం ఉంటుంది. అప్పుడు నిజం తెలిసిన నీకు ప్రాబ్లమ్ రాదని పారిజాతం అంటుంది. నువ్వు ఇప్పుడే కార్తీక్ దగ్గరికి వెళ్ళమని పారిజాతం కార్ దిగి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అప్పుడే నరసింహా జ్యోత్స్న దగ్గరికి వచ్చి డబ్బులు కావాలని అడుగుతాడు. ఆ దీపని ఎటాక్ చేయమంటే నా బావని పొడిచావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఇప్పుడు నిన్ను పోలీస్ లు వెతకుతున్నారు.. ఆ లోపు నువ్వు అనుకున్నది చేయంటూ నరసింహాకి జ్యోత్స్న డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత దీప కార్తీక్ కి‌ భోజనం తీసుకొని వస్తుంది. చాలా బాగున్నాయ్ మా రెస్టారెంట్ లో వర్క్ చేయొచ్చు కదా అని కార్తీక్ అంటాడు నేను వంట చేసి దగ్గరికి నర్సింహా వచ్చి ఇలా చేసాడు. ఇప్పుడు రెస్టారెంట్ లో వర్క్ చేస్తే వాడు ఊరుకుంటాడా అని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.