English | Telugu

ప‌వన్ కళ్యాణ్‌తో సినిమా మిస్స‌యిన‌ 'కార్తీకదీపం' డైరెక్టర్!

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని దర్శకులందరూ కోరుకుంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే అలాంటి క్రేజీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని చెబుతున్నారు 'కార్తీకదీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. బుల్లితెరపై తన సీరియల్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ దర్శకుడు గతంలో 'అందం', 'బంగారు బొమ్మ' అనే సీరియల్స్ ను తెరకెక్కించారు.

అలానే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్లు పని చేశారు. అనంతరం మెగాఫోన్ పట్టుకొని మోహన్ బాబుతో 'శివ శంకర్', అల్లరి నరేశ్‌తో 'రాంబాబు గాడి పెళ్లాం' అనే సినిమా చేశారు. దర్శకుడిగా అనుభవం సంపాదించిన తరువాత ఈయనకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా ప్లాన్ చేశారు కూడా. కానీ ఆ సినిమా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి రెండుసార్లు ఆగిపోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక 'కార్తీకదీపం' సీరియ‌ల్‌ విషయంలో తనపై వస్తోన్న కంప్లైంట్స్, ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఆ సీరియ‌ల్‌లో ప్ర‌తి పాత్ర‌ను ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం వలనే ఇలాంటి స్పందనలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.