English | Telugu

'కార్తీక దీపం'లో కీలక మలుపు... అంజిని తీసుకొస్తున్న వంటలక్క!

ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ తన మెడలో తాళిబొట్టు కట్టాల్సిందేనని, లేదంటే కార్తీక్ కుటుంబ పరువును బజారుకు ఈడుస్తానని మోనిత మంగమ్మ శపథం చేస్తుంది. జూలై 28 తేదీ, 1103 ఎపిసోడ్ లో మోనిత వీరంగం సృష్టించింది. కార్తీక్ అంటే తనకు పిచ్చి అని అతడితో, అతడి భార్య దీపతో చెబుతుంది. 'పెళ్లి అయినవాడిని ప్రేమించడమే తప్పు' అని కార్తీక్ చెప్పినా వినిపించుకోదు.

'నువ్వు ప్రేమించావని నేను ప్రేమిస్తే అది స్వార్థం. కానీ, ప్రేమించకపోయినా పర్వాలేదని ప్రేమిస్తే త్యాగం. నేను త్యాగమూర్తిని. నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెట్టడం అన్యాయం. నువ్వు ద్వేషించవని నీ భార్య నీకు పదేళ్లు దూరంగా ఉంది. కానీ, నేను పదహారేళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నా. మరో మగాడిని దగ్గరకు రానివ్వడం లేదు' అని మోనిత ఆగ్రహావేశాలకు లోనవుతూ ఏడుస్తుంది. 25న కార్తీక్ తన మెడలో తాళి కట్టకపోతే కుటుంబాన్ని బజారుకు ఈడుస్తానని బెదిరిస్తుంది. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

కొత్త ప్రోమోలో హైలైట్స్ ఏంటంటే... మోనిత ఇంటికి దీప వెళుతుంది. సరిగ్గా అప్పుడే మోనితకు ఏసీపీ రోషిణి నుండి ఫోన్ వస్తుంది. అది లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుండి 'బయలుదేరేవా?' అని ప్రశ్న. 'వస్తున్నా మేడమ్' అని మోనిత సమాధానం. 'నీకోసం కూడా వెయిట్ చేయాలా?' అని రోషిణి అసహనం. లోపల ఆందోళన ఉన్నప్పటికీ, పైకి కనిపించనివ్వకుండా 'నేను రోషిణి మేడమ్ దగ్గరకు వెళ్తున్నాను. వచ్చాక నీ పని చెబుతా' అని వంటలక్క అలియాస్ దీపకు మోనిత వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతుంది. 'వెళ్తున్నాను కాదు... వెళ్తున్నాం. మనిద్దరం వెళ్తున్నాం. అక్కడ అంజి ఉన్నాడో, దుర్గ ఉందో? నీ పాత నేరాల గురించి కొత్తగా ఏం కథనాలు చెబుతున్నారో' అంటుంది దీప.

కొన్ని రోజులుగా అంజి ప్రస్తావనను దీప తీసుకొస్తూ ఉంది. మరి, అతడు జూలై 29 ఎపిసోడ్ లో ఎంటర్ అవుతాడో, సస్పెన్స్ లో పెడుతూ మరోరోజు ఆలస్యం చేస్తారో చూడాలి. కాలేజీ రోజుల్లో కార్తీక్ ను దక్కించుకోవడం కోసం అతడు ప్రేమించిన అమ్మాయిని హత్య చేయడానికి అంజికి మోనిత సుపారీ ఇస్తుంది. మంచివాడిగా మారిన అంజి, ఆ విషయం కార్తీక్ కు చెబుతాడు. అదీ సంగతి. ఇప్పుడు ఆ నేరాలు బయటకు వస్తాయేమో చూడాలి. అంజి రాకతో సీరియల్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.