English | Telugu

మోనిత చేయించిన హ‌త్య గురించి ఆమె ముందే కార్తీక్‌కు చెప్పేసిన‌ అంజి!

'కార్తీక దీపం' కీల‌క ద‌శ‌కు చేరుకుంది. కార్తీక్ త‌న‌కు నిజం చెప్పే ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం, సౌంద‌ర్య చెప్పిన మాట‌లు కూడా న‌మ్మ‌క‌పోవ‌డంతో ఇ‌క లాభం లేద‌నుకున్న దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని తీసుకుని ఊరు వ‌దిలి వెళ్లిపోతుంది. వార‌ణాసి ఆటోలో వెళ్తున్న దీప‌కు అత్త సౌంద‌ర్య క‌నిపిస్తుంది... పిల్ల‌లు నానమ్మా అంటారు.. క‌ల‌వాల‌ని దీప‌కు వున్నా వార‌ణాసికి ఆటో పోనివ్వ‌మ‌ని చెప్తుంది దీప. దీంతో ఆటో ముందుకు క‌దులుతుంది.

క‌ట్ చేస్తే.. దీప‌ గురించి ఆలోచిస్తూ కారులో వెళుతున్న కార్తీక్‌కి ఎదురుగా అంజి బైక్ పై వ‌స్తూ క‌నిపిస్తాడు. అంజిని పిలిచి కారెక్క‌రించుకుని మోని‌త ఇంటికి తీసుకెళ‌తాడు కార్తీక్‌. మోనిత ముందు "ఇప్ప‌డు నిజం చెప్ప‌రా" అని బెదిరించ‌డంతో అస‌లు నిజం మొత్తం చెప్పేస్తాడు అంజి. "నీకు మోనిత ఎలా తెలుసు? దీప‌కు ఏం చెప్పావ్‌? మా అమ్మ‌‌‌కు ఏం చెప్పాల‌నుకున్నావ్‌? అన్నీ బ‌య‌ట‌పెట్టేయ్" అని అంజిని నిల‌దీయ‌డంతో మోనిత చేయించిన హిమ హ‌త్య గురించి చెప్పేస్తాడు అంజి. అది విన్న‌ట్టే విని డాక్ట‌ర్ బాబు, "ఇలా దీప నీతో క‌థ‌లు చెప్పిస్తోందా?" అని షాకిస్తాడు. అది కాద‌ని అంజి ఎంత చెప్పినా ప‌ట్టించుకోకుండా బ‌య‌టికి నెట్టేస్తాడు.

అంజి చెప్పింది కార్తీక్‌ న‌మ్మ‌క‌పోవ‌డంతో మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. క‌ప‌ట నాట‌కం ఆడుతూ కార్తీక్ గుండెల‌పై వాలి "ఇప్ప‌డు అర్థ‌మైందా నా వెనక ఎంత భ‌యంక‌ర‌మైన కుట్ర జ‌రుగుతోందో?".. అని క‌ప‌ట‌ప్రేమ‌ని ఒల‌క‌బోస్తూ వుంటుంది. ఈ యాక్టింగ్ కి క‌రిగిపోయిన కార్తీక్ "ఊరుకో మోనితా ఊరుకో" అని మోనిత‌ని ఓదారుస్తాడు. సోమ‌వారం ఈ ఎపిసోడ్ స్టార్ మాలో ప్ర‌సారం కానుంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.