English | Telugu

మోనిత చేయించిన హ‌త్య గురించి ఆమె ముందే కార్తీక్‌కు చెప్పేసిన‌ అంజి!

'కార్తీక దీపం' కీల‌క ద‌శ‌కు చేరుకుంది. కార్తీక్ త‌న‌కు నిజం చెప్పే ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం, సౌంద‌ర్య చెప్పిన మాట‌లు కూడా న‌మ్మ‌క‌పోవ‌డంతో ఇ‌క లాభం లేద‌నుకున్న దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని తీసుకుని ఊరు వ‌దిలి వెళ్లిపోతుంది. వార‌ణాసి ఆటోలో వెళ్తున్న దీప‌కు అత్త సౌంద‌ర్య క‌నిపిస్తుంది... పిల్ల‌లు నానమ్మా అంటారు.. క‌ల‌వాల‌ని దీప‌కు వున్నా వార‌ణాసికి ఆటో పోనివ్వ‌మ‌ని చెప్తుంది దీప. దీంతో ఆటో ముందుకు క‌దులుతుంది.

క‌ట్ చేస్తే.. దీప‌ గురించి ఆలోచిస్తూ కారులో వెళుతున్న కార్తీక్‌కి ఎదురుగా అంజి బైక్ పై వ‌స్తూ క‌నిపిస్తాడు. అంజిని పిలిచి కారెక్క‌రించుకుని మోని‌త ఇంటికి తీసుకెళ‌తాడు కార్తీక్‌. మోనిత ముందు "ఇప్ప‌డు నిజం చెప్ప‌రా" అని బెదిరించ‌డంతో అస‌లు నిజం మొత్తం చెప్పేస్తాడు అంజి. "నీకు మోనిత ఎలా తెలుసు? దీప‌కు ఏం చెప్పావ్‌? మా అమ్మ‌‌‌కు ఏం చెప్పాల‌నుకున్నావ్‌? అన్నీ బ‌య‌ట‌పెట్టేయ్" అని అంజిని నిల‌దీయ‌డంతో మోనిత చేయించిన హిమ హ‌త్య గురించి చెప్పేస్తాడు అంజి. అది విన్న‌ట్టే విని డాక్ట‌ర్ బాబు, "ఇలా దీప నీతో క‌థ‌లు చెప్పిస్తోందా?" అని షాకిస్తాడు. అది కాద‌ని అంజి ఎంత చెప్పినా ప‌ట్టించుకోకుండా బ‌య‌టికి నెట్టేస్తాడు.

అంజి చెప్పింది కార్తీక్‌ న‌మ్మ‌క‌పోవ‌డంతో మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. క‌ప‌ట నాట‌కం ఆడుతూ కార్తీక్ గుండెల‌పై వాలి "ఇప్ప‌డు అర్థ‌మైందా నా వెనక ఎంత భ‌యంక‌ర‌మైన కుట్ర జ‌రుగుతోందో?".. అని క‌ప‌ట‌ప్రేమ‌ని ఒల‌క‌బోస్తూ వుంటుంది. ఈ యాక్టింగ్ కి క‌రిగిపోయిన కార్తీక్ "ఊరుకో మోనితా ఊరుకో" అని మోనిత‌ని ఓదారుస్తాడు. సోమ‌వారం ఈ ఎపిసోడ్ స్టార్ మాలో ప్ర‌సారం కానుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.