English | Telugu

తల్లయిన సుధీర్.. "పాపా, బాబా?" అనడిగిన రష్మి!

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఈ షోకి రోజా, మ‌నో న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ షోలో సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, రామ్ ప్ర‌సాద్ చేసిన కామెడీ టాప్ లేపుతోంది. స్కిట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ గౌత‌మ్ ముందే రామ్‌ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌ను శ్రీ‌మంతం చేసేశారు.

ర‌ష్మీ గౌత‌మ్‌కు, సుడిగాలి సుధీర్‌కు మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె ముందే స్కిట్లో సుడిగాలి సుధీర్‌కు శ్రీ‌మంతం చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. రామ్‌ప్ర‌సాద్ బొట్టు, కాళ్ల‌కు పారాణి పెట్టి శ్రీ‌మంతం చేయ‌డంతో లోప‌లికి వెళ్లిన సుధీర్ చేతుల్లో ఓ పాపాయి బొమ్మ‌ని వెంట తీసుకుని వ‌స్తూ ప్రెగ్నెంట్ లేడీగా నైటీలో క‌నిపించ‌డంతో రోజాతో పాటు ర‌ష్మి ఆ దృశ్యాన్ని చూసి పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వారు.

బిడ్డ‌ని చేతుల్తో సుడిగాలి సుధీర్ ప‌ట్టుకుని వ‌స్తుండ‌గా "వ‌ట ప‌త్ర శాయికి.." అంటూ బ్యాగ్రౌండ్‌ సాంగ్ వేశారు.. ఇంత‌లో రోజా క‌ల్పించుకుని "చూడ్డానికి రెండు క‌ళ్లు చాల‌ట్లేదు" అన్నారు. ఆ వెంట‌నే "నువ్వు అబ్బాయివి.. అలాంటిది నీకు గ‌ర్భం కావ‌డం, మేము నీకు సీ‌మంతం చేయ‌డం.. నీకు బాబు పుట్ట‌డం ఏంటీ?" అనేశాడు రామ్ ప్ర‌సాద్‌.

ఇంత‌లో ర‌ష్మీ క‌ల‌గ‌జేసుకుని "ఇంత‌కీ బాబా, పాపా?" అని అడిగితే రామ్ ప్ర‌సాద్ "ఉండ‌వ‌మ్మా ఈ బిడ్డ‌కి తండ్రెవ‌రో తెలియ‌డం లేదు." అన‌డంతో సుడిగాలి సుధీర్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. వ‌చ్చే శ‌నివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.