English | Telugu
తల్లయిన సుధీర్.. "పాపా, బాబా?" అనడిగిన రష్మి!
Updated : Mar 8, 2021
ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. ఈ షోకి రోజా, మనో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా, రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ చేసిన కామెడీ టాప్ లేపుతోంది. స్కిట్లో భాగంగా సుడిగాలి సుధీర్కి రష్మీ గౌతమ్ ముందే రామ్ప్రసాద్, గెటప్ శ్రీను శ్రీమంతం చేసేశారు.
రష్మీ గౌతమ్కు, సుడిగాలి సుధీర్కు మధ్య ఏదో జరుగుతోందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ముందే స్కిట్లో సుడిగాలి సుధీర్కు శ్రీమంతం చేయడం ఆకట్టుకుంటోంది. రామ్ప్రసాద్ బొట్టు, కాళ్లకు పారాణి పెట్టి శ్రీమంతం చేయడంతో లోపలికి వెళ్లిన సుధీర్ చేతుల్లో ఓ పాపాయి బొమ్మని వెంట తీసుకుని వస్తూ ప్రెగ్నెంట్ లేడీగా నైటీలో కనిపించడంతో రోజాతో పాటు రష్మి ఆ దృశ్యాన్ని చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.
బిడ్డని చేతుల్తో సుడిగాలి సుధీర్ పట్టుకుని వస్తుండగా "వట పత్ర శాయికి.." అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ వేశారు.. ఇంతలో రోజా కల్పించుకుని "చూడ్డానికి రెండు కళ్లు చాలట్లేదు" అన్నారు. ఆ వెంటనే "నువ్వు అబ్బాయివి.. అలాంటిది నీకు గర్భం కావడం, మేము నీకు సీమంతం చేయడం.. నీకు బాబు పుట్టడం ఏంటీ?" అనేశాడు రామ్ ప్రసాద్.
ఇంతలో రష్మీ కలగజేసుకుని "ఇంతకీ బాబా, పాపా?" అని అడిగితే రామ్ ప్రసాద్ "ఉండవమ్మా ఈ బిడ్డకి తండ్రెవరో తెలియడం లేదు." అనడంతో సుడిగాలి సుధీర్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. వచ్చే శనివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.