English | Telugu

"ఆఫర్ ఇస్తే మాకేంటి అంటున్నారు".. సీరియల్ నటి ఆవేదన!

కొన్నిరోజులుగా స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'జానకి కలగనలేదు' సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో పనిమనిషి క్యారెక్టర్ లో నటిస్తోన్న చికిత (రమ్య) తన నటనతో మెప్పిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నటనపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కుటుంబానికి తానే ఆధారం కావడంతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది రమ్య. అయితే తనకు అవకాశాలు వస్తున్నాయి కానీ నాకేంటి అంటూ వేధించేవాళ్లు ఎక్కువగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తొలిసారి 'జానకి కలగనలేదు' సీరియల్ లో ఆఫర్ వచ్చిందని.. రాశి, అమర్, ప్రియాంక లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లతో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. కెమెరా ముందు ఎలా చేయాలో తనకు తెలియకపోతే వాళ్లే హెల్ప్ చేశారని చెప్పుకొచ్చింది. అనంతరం ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. అందరూ అమ్మాయిలను అదే ఉద్దేశంతో చూస్తున్నారని.. ఒక్కోసారి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తోంద‌ని.. ఎందుకు బతికున్నానా..? అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చింది.

తన ఇంట్లో ఆర్థిక‌ ఇబ్బందుల కారణంగా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందని.. వచ్చిన తరువాత క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు వచ్చాయని చెప్పింది. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నో చెప్పేదాన్ని అనీ, అందుకే సరైన అవకాశాలు రాలేదనీ తెలిపింది. కానీ 'జానకి కలగనలేదు' టీమ్ వాళ్లు సాయం చేయడంతో తనకు అవకాశం వచ్చిందని అంటూ.. టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.