English | Telugu

ముందు ఆయ‌న ప్రేమించారు.. ఆ త‌ర్వాత నేను ప్రేమించాల్సి వ‌చ్చింది!

నటి హరితేజ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో బుల్లితెరపై సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ లో నటించిన ఆమె ఆ తరువాత బిగ్ బాస్ షోలో తన కామెడీతో అందరినీ నవ్వించింది. బిగ్ బాస్ షో కార‌ణంగా హరితేజకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ షో తరువాత ఆమెకి అవకాశాలు కూడా బాగా పెరిగాయి. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది హరితేజ.

తరచూ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ పలు రకాల కామెంట్స్ చేస్తుంటుంది. అలాంటి హరితేజ కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. ఆమె ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు కూడా పలు ఫోటో షూట్లు, డాన్స్ లు షేర్ చేస్తూ రచ్చ చేసింది. బిడ్డ పుట్టిన తరువాత హరితేజ సోషల్ మీడియాలో కాస్త దూరమైంది. అయితే రీసెంట్ గా లైవ్ చాట్ ద్వారా తన ఫాలోవర్లను పలకరించింది. ఈ క్రమంలో నెటిజన్లు పలు రకాల ప్రశ్నలతో ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేశారు.

హరితేజది ప్రేమ వివాహమనే సంగతి కొంతమంది మాత్రమే తెలుసు. ఇదే విషయాన్ని తాజాగా ఓ నెటిజన్ అడిగాడు. "మీది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన వివాహమా..?" అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ 'మన్మథుడు' సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు.. ''ముందు ఆయన ప్రేమించారు.. ఆ తరువాత నేను ప్రేమించాల్సి వచ్చింది.. ఇంకా ఇంట్లో వాళ్లకి ఆప్షన్ ఏముంది'' అంటూ ఫన్నీగా బదులిచ్చింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.