English | Telugu

"దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే!"

'జబర్దస్త్'లో హైపర్ ఆది స్కిట్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన కోసమే షోని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు పంచ్ లతో రెచ్చిపోతుంటాడు ఆది. అయినప్పటికీ అతడి స్కిట్ లకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన 'జబర్దస్త్' ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తో క‌లిసి నవ్వించే ప్రయత్నం చేశాడు.

ఒక పేపర్ పట్టుకొని వచ్చి "నువ్వు చ‌దువు" అంటే "నువ్వు చదువు" అనుకుంటూ "ఇద్దరికీ రాదులే" అంటూ చిన్న పంచ్ తో స్కిట్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనను తాను వెధవ అని ఒప్పుకుంటూ.. ''నేను నెంబర్ 1 వెధవ..".. రామ్ ప్రసాద్ ను చూపిస్తూ "వీడు నెంబర్ 2 వెధవ" అని కామెంట్ చేశాడు. వెంటనే రామ్ ప్రసాద్ "నన్ను పిలిచి ఇన్సల్ట్ చేస్తావా.. నెంబర్ వన్ నాకే ఇవ్వు" అన్నాడు. ఆది "స‌రే" అన‌గానే అంతా గొల్లున న‌వ్వేశారు.

ఇక లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన శాంతి స్వరూప్.. "మొన్న ఒకడు నన్ను చూసి చేయి కోసుకున్నాడు" అని అన్నాడు. దానికి హైపర్ ఆది.. "దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. 'ఉప్పెన' సినిమాలో క్లైమాక్స్ సీన్ ను ఉద్దేశిస్తూ ఈ పంచ్ వేశాడు. ఈ పంచ్ లకు మ‌నో, రోజా, అనసూయ పడిపడి మరీ నవ్వుకున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.