English | Telugu

ఇంట్లో ఉంటూనే సంపాదించేస్తోన్న సుమ! ఎలా అంటే...

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది సుమ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమెకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెరపై టీవీ షోలు, సినిమా ఈవెంట్లు అంటూ సుమ చాలా బిజీగా ఉంటోంది. గ్యాప్ లేకుండా వరుస షోలతో భారీ సంపాదన ఆర్జిస్తోంది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది వర్క్ లేక ఇబ్బంది పడుతున్నారు. సుమ కూడా మొన్నామధ్య ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

ఇదిలా ఉంటే.. సుమ ఇంట్లో ఉంటూనే సంపాదించడం మొదలుపెట్టింది. పలు ప్రొడక్ట్ లను ప్రమోట్ చేస్తూ వాటికి అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. "ఇడ్లీ దినోత్సవం" అంటూ ఈమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా ఏదో ఒక డే ఉన్నప్పుడు ఇడ్లీకి ఓ డే ఉండకూడదా? అంటూ వేడి వేడి ఇడ్లీలను తయారు చేసింది.

దాని కోసం ఒక కంపెనీ వారు చేసిన స్పెషల్ పొడులను ప్రమోట్ చేసింది. పుట్నాల పొడి, కారంపొడి, తనకెంతో ఇష్టమైన చల్ల మిరపకాయల పొడి ఉన్నాయని వారి ఉత్పత్తులను వివరిస్తూ ప్రమోట్ చేసింది. ఈ పొడులు కావాల్సిన వారు వాట్సప్ చేయొచ్చు లేదా వెబ్ సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు అంటూ సుమ తన స్టైల్లో ప్రమోషన్ చేసింది. మొత్తానికి ఇంట్లో ఉంటూ ప్రమోషన్స్ తోనే డబ్బులు సంపాదించేస్తోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.