English | Telugu

పెళ్లి చేసిన ఫేస్‌బుక్ ప్రేమ‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఆనంద్ క్యూట్ ఫ్యామిలీ!

'జబర్దస్త్' షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో ఆనంద్ కూడా ఒకడు. రీసెంట్ గా అతడు తన ఫ్యామిలీను అభిమానులకు పరిచయం చేశాడు. భార్యా, పిల్లలను కెమెరా ముందుకు తీసుకువచ్చి పరిచయం చేయగా.. నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. 'జబర్దస్త్' షోకి వచ్చిన తరువాత కూడా అతడికి అవకాశాలు అంత సులువుగా రాలేదు.

చివరికి చమ్మక్ చంద్ర అతడిని నమ్మి గ్రూప్ లో చేర్చుకోవడంతో టీమ్ లీడర్ అయ్యేవరకు వచ్చాడు. తన సంపాదనతో ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ సెట్ చేసుకొని అందులో తన పర్సనల్ విషయాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడంతో పాటు విభిన్నమైన కంటెంట్ పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల తన ఫ్యామిలీకి చెందిన వీడియోను పోస్ట్ చేశారు. తన భార్యను మొదటిసారి వీడియో ద్వారా పరిచయం చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మీ భార్య హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలానే తన ఇద్దరు కొడుకులకు పరిచయం చేయగా.. వారు కూడా చాలా క్యూట్ గా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు. ఆనంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ఇష్టంగా మారడం తరువాత ఒకరినొకరు పెళ్లి వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పెద్ద గొడవలు జరిగాయని.. అప్పుడు చమ్మక్ చంద్ర, రోజా గారు సాయం చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆనంద్.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.