English | Telugu

సుధీర్ ఇంట్లో విషాదం.. చివరిచూపు కూడా దక్కలేదు!

సుడిగాలి సుధీర్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎంతో కష్టపడి టీవీ కమెడియన్ గా, హోస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'జబర్దస్త్' లోకి రావడానికి ముందు సుధీర్ మెజీషియన్ గా పని చేశాడు. ఎన్నో ఈవెంట్స్ లో మ్యాజిక్ చేసిన సుధీర్ ఫైనల్ గా 'జబర్దస్త్' షోలో చేరి బాగా పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో బిజీగా ఉన్నాడు సుధీర్. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోలో రామ్ ప్రసాద్, హైపర్ ఆది వంటి కమెడియన్స్ కూడా స్కిట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాప్ కామెడీ షోలలో ఒకటిగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుధీర్ కంటతడి పెట్టుకున్నాడు. కార‌ణం.. ఇటీవల సుధీర్ ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. అతడి అమ్మమ్మ కరోనా సోకి కన్నుమూశారు. అయితే చివరిసారి ఆమెను చూడడానికి కూడా పరిస్థితులు అనుకూలించలేదని ప్రోమోలో సుధీర్ క్లోజ్ ఫ్రెండ్‌ రామ్ ప్రసాద్ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అమ్మమ్మ చనిపోయిందని తెలిసి సుధీర్ చాలా బాధపడ్డాడని చెబుతూ.. వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోయినట్లు రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో సుధీర్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షోకి నటుడు పృథ్వీతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా వచ్చారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.