English | Telugu

వంట‌ల‌క్క చ‌చ్చిపోతే.. మిమ్మ‌ల్ని ఊరికే వ‌ద‌లం!

చాలా కాలంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న‌ 'కార్తీకదీపం' సీరియల్. గత కొన్నిరోజులుగా ఈ సీరియల్ ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య వస్తోన్న ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లు ఓ రేంజ్ లో పండుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'కార్తీకదీపం' యూనిట్ కు బెదిరింపులు మొదలయ్యాయి.

దానికి కారణం ఏంటంటే.. కొద్దిరోజులుగా ఈ సీరియల్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీరియల్ లో వంటలక్క క్యారెక్టర్ ను చంపేస్తున్నారని.. ఇకపై ఆమె సీరియల్ లో కనిపించదనే మాటలు వినిపించాయి. దానికి తగ్గట్లే రీసెంట్ ఎపిసోడ్స్ లో వంటలక్క ఆరోగ్యం దెబ్బ తినడం, హాస్పిటల్ జాయిన్ చేయడం వంటి సన్నివేశాలను టెలికాస్ట్ చేయడంతో జనాలంతా ఇక హీరోయిన్ ను చంపేస్తారనే అభిప్రాయానికి వచ్చేశారు.

దీంతో స్టార్ మా యాజమాన్యాన్ని, 'కార్తీకదీపం' టీమ్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే 'కార్తీకదీపం' హీరోయిన్ ప్రేమి విశ్వనాధ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది. అందులో ఓ నెటిజన్ 'వంటలక్క చచ్చిపోతే రెండు రాష్ట్రాలు తగలబడిపోతాయ్' అంటూ బెదిరించినట్లుగా మీమ్‌ పోస్ట్ పెట్టాడు. అలానే వంటలక్క క్యారెక్టర్ ను చంపేస్తే స్టార్ మా ఛానెల్ ని ఊరికే వదలం అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.