English | Telugu

స్కిట్ తెచ్చిన తంటా.. క్షమాపణలు కోరిన హైపర్ ఆది!

'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచేలా 'శ్రీదేవి డ్రామా కంపనీ' షోలో ఓ స్కిట్ చేశాడని.. అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ ముదిరిపోతుందని గ్రహించిన మల్లెమాల టీమ్ యూట్యూబ్ నుండి వీడియోను తొలగించింది.

ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించక తప్పలేదు. తను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమేనని స్క్రిప్ట్ తను రాయలేదని చెప్పాడు. తాజాగా తమ స్కిట్ కారణంగా బాధపడ్డ వాళ్లకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు హైపర్ ఆది. ఆంధ్ర, తెలంగాణ అనే బేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడూ ఉండవని ఈ వీడియోలో వివరించాడు.

అన్ని ప్రాంతాల వాళ్లం ఎంతో సరదాగా కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటామని.. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. కలిసే పరిష్కరించుకుంటామని తెలిపాడు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని స్పష్టం చేశాడు. అన్ని ప్రాంతాల వారి ప్రేమాభిమానాలు వలనే అందరినీ ఇలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నామని చెప్పాడు. ఏది ఏమైనా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.