English | Telugu

వాళ్లు వ‌స్తే రానీ.. వాళ్లతో నాకు పోటీ లేదు!

బుల్లితెరపై దాదాపు ఇరవై సీరియల్స్ లో నటించిన లహరి ప్రస్తుతం 'గృహాలక్ష్మీ' సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్ లో అమాయకంగా కనిపించే లహరి రియల్ లైఫ్ లో మాత్రం తాను ముక్కుసూటిగా ఉండే అమ్మాయినంటూ కొన్ని విషయాలను పంచుకుంది. ఇప్పటివరకు తను చేసిన అన్ని పాత్రలు నచ్చే చేశానని.. ప్రస్తుతం నటిస్తోన్న 'గృహాలక్షీ' సీరియల్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని,కాబట్టి తన పాత్రకు ఢోకా ఉండదని చెప్పింది. పాత్ర విషయానికొస్తే.. అది డైరెక్టర్ చేతిలో ఉంటుందని.. రేటింగ్ బట్టి మారిపోతుంటుందని.. జనాలకు నచ్చి రేటింగ్ వస్తే ఉంచుతారు లేదంటే లేదని చెప్పింది.

రేటింగ్ బట్టి కథ మారిపోతుందని.. సీరియల్ లో ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలతో మంచి పేరొచ్చిందని.. జనాలు గుర్తుపట్టి పలకరిస్తుంటార‌ని.. తనను అభిమానిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక సీరియల్స్ లో కానీ.. రియల్ లైఫ్ లో కానీ చేదు అనుభవాలు లేవని క్లారిటీ ఇచ్చింది. గొడవలకు దూరంగా ఉంటానని.. దేన్నీ సీరియస్ గా తీసుకోనని చెప్పింది. ఎవరైనా గొడవ పెట్టుకోవడానికి వస్తే పక్కకి తప్పుకుంటానని.. అలాంటి వారికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తెలుగు సీరియల్స్ లో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం గురించి మాట్లాడుతూ.. తనకు ఆ విషయంలో ఎలాంటి బాధ, బెంగ లేవని చెప్పింది. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి చేసేస్తున్నారు.. నాకు రోల్స్ రావనే భయం తనకు లేదని.. ఎవరు వచ్చినా, వెళ్లినా పట్టించుకోనని.. వాళ్లతో తనకు పోటీ లేదని.. తన రోల్స్ తనకు ఉన్నాయని స్పష్టం చేసింది. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని.. కానీ సీరియల్స్ లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.