English | Telugu

మోనాల్‌కి అఖిల్ పెట్టుకున్న‌ ముద్దు పేరు ఇదే!

బిగ్ బాస్ సీజన్ 34 లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న మోనాల్-అఖిల్ ఎంతో స్నేహంగా మెలిగారు. మొదట్లో అభిజిత్‌తో క్లోజ్‌గా ఉండే మోనాల్ ఆ తరువాత అఖిల్‌కి దగ్గరైంది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు అలగడాలు, బుజ్జగించుకోవడాలు సీజన్‌కి హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఎపిసోడ్‌లో ఎక్కువ భాగం వీరి గురించే ప్రసారం చేసివారు. హౌస్ నుండి బయటకు వచ్చేసిన తరువాత కూడా ఈ జంట తమ స్నేహాన్ని కొనసాగిస్తోంది.

తరచూ వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు. దీంతో నిజంగానే వాళ్ల మధ్య ఏదో ఉందనే టాక్ నడుస్తోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా వీరిద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. మోనాల్ ను 'గుజ్జు' అంటూ సంబోధించాడు. దీనికి మోనాల్ కూడా 'అఖిలూ' అంటూ ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'తెలుగు అబ్బాయి గుజ‌రాత్ అమ్మాయి' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.